ఈ మధ్య ఎక్కడ చూసినా అక్రమ సంబంధాల హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అన్యోన్యంగా గడిచిపోతున్న భార్య భర్తల అనుబంధం లో కి మూడో వ్యక్తి ప్రవేశించడం.. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కోపతాపాలు వచ్చే అవి ఏకంగా ఒకరినొకరు చంపుకునేంత  వరకు దారి తీయడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఇలాంటి ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. వేరే వారి మోజులో పడిన భార్య ఏకంగా తన భర్త అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని చంపేసి అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీంతో ప్రియుడితో కలిసి పక్క ప్లాన్ వేసి భర్తను కాటికి పంపించేసింది ఇక్కడ ఓ భార్య. అయితే పక్కాగా ప్లాన్ వేసుకొని నేరానికి పాల్పడిన పెద్ద పెద్ద నేరస్తులు పోలీసులకు దొరికిపోతా ఉంటే.. సాదాసీదా వ్యక్తులు  హత్య చేస్తే దొరికి పోకుండా ఉంటారా. పోలీసుల విచారణలో అసలు విషయం బయటికి వచ్చింది ప్రియుడితో సహా  సదరు మహిళ కటకటాలపాలయ్యారూ . 

 

 

 

 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా లో ఈ ఘటన చోటుచేసుకుంది. బొమ్మ పాట కు చెందిన నాగరాజు హేమలత భార్య భర్తలు వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. అయితే 2010 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చి స్థిరపడింది ఈ కుటుంబం. కాగా సిటీ శివారులోని ప్రగతి నగర్లో ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పని చేస్తూ ఉంటాడు నాగరాజు. ఇక వాళ్ల జీవితం అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో..   ఇంతలో మధ్యలోకి మూడో వ్యక్తి బిల్డర్ వెంకటేశ్వర్ రెడ్డి వచ్చాడు. క్రమక్రమంగా నాగరాజు భార్యతో వివాహేతర పెట్టుకున్నాడు బిల్డర్ వెంకటేశ్వర్ రెడ్డి. ఇక ఈ విషయం కాస్త ఓ రోజు నాగరాజు వరకు వెళ్ళింది. దీంతో ఇదేం పాడుబుద్ధి నీ తిరు మార్చుకో అంటూ నాగరాజు భార్యను మందలించాడు. అయినప్పటికీ భార్య తీరులో మార్పు రాకపోవడంతో.. అక్కడ ఉద్యోగం మానేసి మరో పారిశ్రామికవాడలో భార్యతో కలిసి ఉద్యోగంలో చేరాడు నాగరాజు. 

 

 

 అయితే చోటు మారినప్పటికీ వారిద్దరి అక్రమ సంబంధం మాత్రం కొనసాగుతూనే ఉండేది. భార్య తీరులో మార్పు రాకపోవడంతో మరోసారి నాగరాజు భార్యను గట్టిగా మందలించాడు. ఇంకేముంది ప్రియుని మర్చిపోలేక పోయిన సదరు భార్య హేమలత.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగిస్తే సరిపోతుంది అనుకుంది. దీంతో ప్రియుడు వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి ప్లాన్ వేసింది. ఇక పథకం ప్రకారమే ఈ నెల 10న నాగరాజుకు వెంకటేశ్వర్ రెడ్డి మద్యం తాగించాడు. ఇక ఆ తర్వాత వెంకటేశ్వర్ రెడ్డి ఏకంగా కర్ణాటకలోని గుల్బర్గా దగ్గర్లో ఓ ప్రాంతానికి  తీసుకెళ్ళాడు. వెంకటేశ్వర్ రెడ్డి వెనుక ఓ పనోడిని  కూడా తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక మరోసారి నాగరాజు కు మద్యం  ఫుల్లుగా తాగించి... ఇద్దరూ తలపై పెద్ద బండరాళ్ళతో కొట్టారు. తర్వాత నాగరాజు స్పృహ కోల్పోవడంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు.

 

 

 ఈ విషయం తెలుసుకున్న గుల్బర్గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. ఇటు సదరు భార్య హేమలత కూడా ఎప్పటిలాగే తన భర్త కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక  పోలీస్ విచారణలో భార్య హేమలత వణికిపోతూ సమాధానం చెబుతుండడం... పొంతన లేకుండా మాట్లాడుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా విచారణ చేపట్టగా  అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో గుల్బర్గా నుంచి మర్డర్ కేసు బాచుపల్లి కి షిఫ్ట్ అయిపోయింది. ఇక హత్యకు పాల్పడిన హేమలత,  ప్రియుడు వెంకటేశ్వర్రెడ్డి  జైల్లో ఊచలు  పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: