దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ పై అత్యాచారం, హత్య కేసులో రోజు కో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.  దిశను పాశవికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నలుగురు నింధితులు పోలీసుల తప్పించుకొని వారిపై దాడి చేసి పారిపోతుండగా ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి దేశంలో తెలంగాణ పోలీసులపై ఎంతో మంది ప్రశంసలు కురిపించారు.  ఇలాంటి ఘటనకు పాల్పపడిన వారికి సరైన బుద్ది చెప్పారని.. మిగత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అత్యాచారాలు కొద్దిగైనా తగ్గుతాయనిఅభిప్రాయ పడుతున్నారు. దిశ లాంటి అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని వెంటనే ఉరి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.  ఇక ఏపిలో కనీ వినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ దిశ యాక్ట్ తీసుకు వచ్చారు.. ఇందుకు అసెంబ్లీ ఆమోద ముద్ర కూడా వేశారు.  ఈ చట్టం ప్రకారం ఏపిలో అత్యాచారలు, హత్యలకు, లైంగి వేధింపులకు పాల్పపడే వారికి వే గవంతంగా శిక్షలు పడే అవకాశం వస్తుంది.  

 

తాజాగా దిశ హత్య కేసులో సంచలన నిజాలు బయట పడుతున్నాయి.  దిశ మృతదేహం లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దిశపై అత్యాచారం చేసే ముందు ఆమెకు బలవంతంగా దుర్మార్గులు మద్యం నోట్లో పోసి ఉంటారని.. దాంతో ఆమె ఆపస్మారక స్థితిలో చేరుకోగానే పైశాచికంగా పలు మార్లు అత్యాచారం చేసి ఉంటారని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే విషయాన్ని గతంలో నింధితులు జైల్లో పోలీసులకు చెప్పినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

 

అప్పట్లో ఈ విషయంపై సీపీ సజ్జనార్  అత్యాచారం చేసే  సమయంలో నిందితులు ఫుల్ గా తాగి ఉండడమే కాకుండా దిశా కి కూడా బలవంతంగా మద్యం తాగించారు అంటూ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని పోలీసు విచారణలో నిందితులు కూడా వాంగ్మూలంలో  ఈ విషయాన్ని తెలిపారు. ఇదే విషయం ఫోరెన్సిక్ నివేదికలో కూడా తేటతెల్లం అయ్యింది.  అయితే దిశను అత్యాచారం చేస్తూ బలవంతంగా నోట్లో మద్యం పోస్తుంటే ఎంత విల విలలాడిందో పాపం అని అలాంటి వారికి దేవుడు త్వరగా శిక్ష విధించాడని ప్రజలు, దిశ తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: