హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ దిశ ఫోరెన్సిక్ సైన్స్  లాబరేటరీ పరీక్షల్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. కాలిపోయిన దిశ మృతదేహంలోని ఎముకల నుండి  సేకరించి న డిఎన్ఏలో మద్యం  ఉన్నట్లు తేలింది.  అలాగే డిఎన్ఏ ఆధారంగా కాలిపోయిన మృతదేహం దిశాదే అన్న విషయం కూడా తేలిపోయింది. అదే సమయంలో దిశ శరీరంలో ఆల్కహాల్ అవశేషాలున్నట్లు కూడా లాబరేటరీలో బయటపడింది.

 

అంటే దిశపై అత్యాచారం చేసేటపుడు నిందితులు నలుగురు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారని పోలీసులు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అత్యాచారం చేసే సమయంలో ఆమె ఎక్కడ అరుస్తుందో అన్న భయంతోనే నిందితులు  బలవంతంగా ఆమె గొంతులో మద్యం పోశారు. దాంతో  దిశ  స్పృహతప్పింది.  దిశ స్పృహ తప్పిపోయిందని అర్ధమైన తర్వాత నిందితులు పాశవిక చర్యకు పాల్పడ్డారు.

 

అలాగే గతంలో జరిగిన మరికొన్ని నేరాల్లో కూడా నిందితుల హస్తముందనే విషయం డిఎన్ఏ  పరీక్షలో బయటపడింది. అంటే వీరు నలుగురు  ఒక్క దిశతోనే తమ నేరవృత్తిని మొదలుపెట్టలేదన్నది స్పష్టమైంది. గతంలో చాలా నేరాలు చేసిన తర్వాతే చివరకు దిశపై హత్యాచారానికి పాల్పడ్డారన్న విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది.

 

నిజానికి నిందితులు నలుగురిలో ముగ్గురు మైనర్లే. అయినా తాము నేరాల్లో పాల్గొనటానికి వయసును కూడా వాళ్ళు కవచంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. నలుగురిలో ముగ్గురు 14-17 ఏళ్ళలోపు వారే కావటం గమనార్హం. ఎవరైనా చూసినా వీళ్ళను చిన్నపిల్లలుగానే పరిగణిస్తారు. అంతేకానీ ఇంత చిన్న పిల్లలే నేరాలకు పాల్పడుతున్నారా ? అన్న అనుమానం కూడా ఎవరికీ రాదన్న విషయాన్ని వీళ్ళు బాగా గ్రహించారు.

 

అందుకనే యధేచ్చగా నేరాలకు పాల్పడ్డారు. అందుకనే చాలామందికి లాగే పోలీసులకు కూడా వీళ్ళపై ఇంతకాలం ఎటువంటి అనుమానాలు రాలేదు. కాకపోతే వాళ్ళ పాపం పండి చివరకు దిశపై హత్యాచారం కేసులో దొరికిపోయారు. అందుకనే చివరకు ఎన్ కౌంటర్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: