ఈ సమాజానికి ఏం మాయరోగం వచ్చిందో అర్ధం కావడం లేదు. ఎన్ని నీతులు చెబుతున్న, చట్టం ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఎంత కఠినంగా శిక్షిస్తున్న అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూడు మానభంగాలు, హత్యలు అనే వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’ మరువక మునుపే.. హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే..

 

 

చాంద్రాయణగుట్ట చౌరస్తాకు సమీపంలోని హాషామాబాద్‌లో నివసించే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఐదు రోజుల క్రితం చార్మినార్ వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కారు. వారిని నమ్మించిన ఆటో డ్రైవర్‌ అతనితో పాటు మరొక మృగంతో కలిసి ఆ అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి చర్యకు అందులో ఒక బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురైన వారు తమను జహంగీర్‌పీర్‌ దర్గాకు తీసుకెళ్లాలని  చెప్పడంతో.. సాయంత్రం సమయంలో దర్గాకు వెళ్లడం సురక్షితం కాదని వట్టేపల్లిలోని తన ఇంటికి తీసుకెళ్లి రాత్రికి అక్కడే పడుకుని ఉదయం వెళ్లాలని సూచించి అతను వెళ్లిపోయాడు.

 

 

కాసేపటి తర్వాత ఆటో డ్రైవర్ సోదరుడు మూసా వారిని నమ్మించి ఇక్కడి నుండి తప్పిస్తానని చెప్పి తన బైక్‌పై రాత్రి సమయంలో నాంపల్లికి తీసుకెళ్లాడు. మాయమాటలతో వారిద్దర్నీ లాడ్జికి తీసుకెళ్లి. తన కోరిక తీర్చాలంటూ అక్కను వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చెల్లెలిని చంపేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

 

 

ఈ లోగా ఇద్దరు బాలికలు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలో ఇద్దరు బాలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిద్దర్నీ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో బాలిక(18) తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పడంతో పోలీసులు మూసాతో పాటు ఈ ఆటోడ్రైవర్‌‌ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: