బాలకృష్ణ నటించిన రూలర్‌ ఆడియా విడుదల కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నగరంలోని ఎంజీఎం పార్కులో నిర్వహించనున్నట్టు నందమూరి బాలకృష్ణ విశాఖ సిటీ అధ్యక్షుడు కె.శంకర్‌, టీడీపీ నగర కార్యదర్శి పట్టాభిరామ్‌, ఆలిండియా బాలకృష్ణ ఫ్యాన్సు అసోసియేషన్‌ కన్వీనర్‌ తిలక్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వారు శుక్రవారం ఎంవీపీ కాలనీ టీడీపీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో శంకర్‌, పట్టాభిరామ్‌, తిలక్‌ మాట్లాడుతూ శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఎంజీఎం పార్కులో రూలర్‌ ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.


రూలర్ ఆడియో విడుదలకు భారీ ఏర్పాట్లు..
నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్ అని చెప్పారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం విశాఖలో శనివారం జరగనుంది. విశాఖలోని ఎంజీఎం పార్కులో జరిగే ఈ కార్యక్రమానికి  బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలందరూ హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు చిత్రం బృందం హాజరవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ట్రైలర్‌ కూడా విడుదలైన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. విలేఖరుల సమావేశంలో నేతలు పైడిరాజు, అప్పారావు, పోతన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తదుపరి చిత్రానికి బాలయ్య రెడీ 
బాలకృష్ణ త్వరలో రూలర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్‌ కాకముందే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు బాలయ్య. తనకు సూపర్‌ హిట్స్‌ అందించిన స్టార్‌ దర్శకుడితో హ్యాట్రిక్‌ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం తన 105వ సినిమాగా తెరకెక్కుతున్న రూలర్‌ సినిమా పనుల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ, ఆ సినిమా పూర్తయిన వెంటనే ఏ మాత్రం గ్యాప్‌ తీసుకోకుండా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించిన చిత్రయూనిట్ త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మిరియాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: