ఈనాడు... ఈ పత్రిక గురించి ప్రతేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలుగు బాష ఇంకా బ్రతికి ఉందంటే దానికి ఒకరకంగా ఈనాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈనాడు పత్రిక వాడే భాష విధానం. అందుకు కారణం రామోజీరావు. అలాంటిది ఆయన ప్రధాన బాధ్యత నుంచి తప్పుకున్నారు. అదేంటి, పత్రిక యజమానే రామోజీరావు కదా అని ఆశ్చర్యపోతున్నారా ..? అయితే అది కేవలం పత్రిక చీఫ్ ఎడిటర్ బాధ్యతల నుంచి మాత్రమే ఆయన వైదొలిగారు.
శనివారం (డిసెంబరు 14) నాడు రోజు వెలువడ్డ పత్రికలో ఈ మార్పు అగుపించింది. శుక్రవారం కూడా ఎడిటర్ స్థానంలో రామోజీరావు పేరే కొనసాగింది. అయితే శనివారం నాటి పత్రిక ఇంప్రింట్ లైన్ లో (ఆఖరి పేజీలో అడుగుభాగంలో ఉంటుంది). ఎడిటర్ స్థానంలో మరో పేరు కూడా ఉంది. అయితే, తెలంగాణ ఎడిషన్కు ఒకరి పేరు, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కు మరొకరి పేరు ఉండడం ఇక్కడ విశేషం. ఫౌండర్ గా మాత్రమే రామోజీరావు పేరు ఉంది.
తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లకు ఎడిటర్ గా డీఎన్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ కు ఎడిటర్ గా ఎం.నాగేశ్వరరావు పేర్లు ప్రింట్ చేసి ఉన్నాయ్. వీరిద్దరూ ఈనాడు సంస్థలో చాలా సీనియర్ ఎడిటర్లు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ కు ఎడిటర్ గా ఉన్న ఎం.నాగేశ్వరరావు ఈనాడు జర్నలిజం స్కూలుకు ప్రిన్సిపల్ గా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండడం సహా, ఈటీవీ న్యూస్ ఛానెళ్లలో ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ గుర్తింపు పొందారు. ఈయన పలు సందర్భాల్లో వివిధ అంశాలపై చర్చా వేదికలు టీవీలో నిర్వహిస్తుంటారు.
1974 లో ఈనాడు స్థాపించిన తొలి రోజు నుంచి చీఫ్ ఎడిటర్ గా రామోజీరావు మాత్రమే కొనసాగుతున్నారు. తాజా పరిణామంతో 46 ఏళ్ల ఈనాడు పత్రిక చరిత్రలో తొలిసారి చీఫ్ ఎడిటర్ స్థానంలో మరొకరి పేరు వచ్చింది. మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన పెద్ద కుమారుడు సీహెచ్. కిరణ్ ఉన్నారు.