చెడపకురా చెడేవు అన్నారు మన పెద్దలు. ఈ ముక్క అక్షర సత్యం అని దిశ నిందితుల విషయంలో నిజమవుతుంది. మద్యం మత్తులో కన్ను మిన్ను కానక అమాయకురాలైన ఓ అబల మరణానికి కారకులైన ఈ మృగాళ్ళు తప్పు చేశారంటూ లోకం మొత్తం నిందించి వీరి చావుని కోరింది. కాని ఆ తప్పు చేయించింది వారిలో ఉన్న మద్యం అని ఎందుకు గుర్తించడం లేదు లోకం అని అంటున్నారు కొందరు ఆలోచన పరులు. తప్పు జరిగింది కాబట్టి ఒకవైపే ఆలోచిస్తున్నారు.

 

 

వీరు చేసింది దారుణమైన తప్పే కాదని ఎవరు అనరు కాని ఆ తప్పు చేసేలా ప్రేరేపించింది మాత్రం వారు నిషాలో ఉండటం. అదే వారిని అనంత లోకాలకు పంపింది. ఒక దిశ ఘటనే కాదు నిత్యం మద్యం తాగిన మృగాళ్లలో కన్ను మిన్ను కానరాక కన్న వారినే అనుభవిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అందుకే ఓ సామేత కూడా ఉంది. తాగినవాడికి తల్లి పెళ్ళాం అవుతుందని. ఆసమయంలో మనిషి తన మనసుపై కంట్రోల్ కోల్పోయి పశువుగా మారుతాడు. ముందే కామంతో రగిలే వానిలో ఇంత చుక్క పడగానే అప్పటి వరకు నిదురించే భయంకర మృగం మేల్కొని జనారణ్యంలోని లేడిపిల్ల కోసం వెతుకుతుంది.

 

 

ఇప్పుడు ఇదే జరిగింది. ఇకపోతే తవ్వుతున్న కొద్ది దిశ కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. దిశ లివర్‌లో లిక్కర్‌ను ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించారు. దిశ కేసులో పోలీసులకు మరో ఆధారం బలంగా మారింది. అత్యాచారం సమయంలో దిశ నోట్లో నిందితులు బలవంతంగా మద్యం పోసినట్లు గుర్తించారు. రన్‌వే 44 వైన్స్‌లో నిందితులు మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసులు సీసీఫుటేజ్‌ సేకరించారు.

 

 

మరోవైపు దిశ ఎన్‌కౌంటర్‌ నిందితుల మృతదేహాల అప్పగింత పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో మరికొన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలా లేదు. ఈ ఘటనతో అయినా ఈ మృగాళ్లలో మార్పు రావడం లేదు అని అనుకుంటున్నారు ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు..

మరింత సమాచారం తెలుసుకోండి: