దిశ పై అత్యాచారం హత్య కేసులో పోలీసులు ఇప్పటికే నిందిస్తులను ఎన్ కౌంటర్ చేశారు.  ఈ ఎన్ కౌంటర్ జరిగి పది రోజులు కావొస్తోంది.  పాపం ఎన్ కౌంటర్ తరువాత ఆ నలుగురు నిందిస్తుల  డెడ్ బాడీలను ఖననం చేయకుండా ఫ్రిజ్ లో వస్తువులను దాచిపెట్టినట్టు గాంధీ మార్చురీలో వారి శవాలను దాచి ఉంచారు.  పైగా డి కంపోజ్ కాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది హైకోర్టు.  


దీని వలన ఎవరి లాభం ఉంటుంది అనే విషయం పక్కన పెడితే, దీని వలన రాష్ట్రానికి నష్టం తప్పించి మరెలాంటి ఉపయోగం ఉండదు.  నిందితులు చనిపోయారు.  కేసు క్లోజ్ అయిపొయింది.  మరి ఇంకా ఎందుకు ఈ కమీషన్లు, కేసులు, దానికి సంబంధించి ప్రజాధనం దుర్వినియోగం.  దానికి బదులుగా మరో దానిపై దృష్టిపెడితే బాగుటుంది.  బాధితురాలు లేదు.. నిందితులు లేరు.. ఇద్దరు లేనపుడు ఈ కేసు గురించి పదేపదే మాట్లాడుతూ.. పదేపదే విచారణలు జరుపుతూ పాపం ఇరువైపుల ఉన్న కుటుంబాలను బాధించడం అనవసరం కదా.  


పోనీ నిందితులను పట్టుకొని అలానే కోర్టులో ప్రొడ్యూస్ చేసి... దానికి అనుగుణంగా కేసులు నడుస్తుంటే సరే అనుకోవచ్చు.  అయిపోయిన విషయాన్ని పట్టుకొని ఇంకా దాని గురించే ఆరా తీస్తూ ఆలోచనలు చేస్తూ ఇంకా సాగదీస్తుంటే విషయం ఎక్కడికో పోతుంది.  తప్పించి దానివలన పెద్దగా ఉపయోగం ఉండదు అన్నది కొందరి వాదన.  కొందరి వాదన అని కాదు.  అవసరం లేదు కూడా.  


ఈ విషయంలో సుప్రీం కోర్టు ఎందుకు జ్యుడీషియరీ విచారణకు ఆదేశించిందో అర్ధం కాలేదు.  2008 లో యాసిడ్ దాడి జరిగిన సమయంలో నిందితులను ఎన్ కౌంటర్ చేశారు.  అప్పుడు దాని గురించి పెద్దగా మాట్లాడలేదు.  ఎలాంటి విచారణ జరగలేదు.  కానీ, ఇప్పుడు విచారణ పేరుతో ఇలా చేయడం ఎంతవరకు న్యాయం అన్నది తెలియాలి.  ఈ విచారణ వలన కలిగే లాభం ఏంటో చూద్దాం.  విచారణ కోసం ఆరు నెలల సమయం ఇచ్చింది సుప్రీం కోర్టు.  ఈ ఆరు నెలలపాటు ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వమే చూడాలి కదా.  అదంతా ప్రభుత్వానికి లాస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: