చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఘోర  పరాజయం తరువాత పాపం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు.  అసెంబ్లీలోపలే కాదు.. బయటకు కూడా ఆయనకు అవమానాలు జరుగుతున్నాయి.  బాబును అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వడం లేదు.  గేటు దగ్గర అడ్డుకోవడంతో పాటుగా లోపలికి వచ్చే సమాయంలో అడ్డు పడటం సరికాదు.  గత ప్రభుత్వం హయాంలో ఎన్ని గొడవలు ఉన్నా ఇలాంటి గొడవలు మాత్రం జరగలేదు.  


కానీ, ఇప్పుడు అన్ని గొడవలే జరుగుతున్నాయి. బాబు కనిపిస్తే గల్లీ నాయకుడి నుంచి మంత్రి వరకు అందరూ భగ్గుమంటున్నారు.  ఒంటికాలిపై లేస్తున్నారు.  ఇక  వైకాపా నేత అంబటి రాంబాబు విషయానికి వస్తే.. అయన అంటున్న మాటలు అన్నీఇన్నీ కాదు.  బాబును అసెంబ్లీలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాడు.  పిట్టకథలు చెప్తూ బాబు పరువు తీస్తున్నాడు.  అసెంబ్లీలో హుందాగా ఉండాలని చెప్తూ దెప్పిపొడుస్తుంటాడు.  


తాజాగా బాబుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.  గతంలో సాక్షి పత్రికను అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేసారని ఆరోపించారు.  కానీ, బలమైన మీడియాగా ఎదగడంతో ఏమి చేయలేకపోయారని అన్నారు.  ఎవరిపైనా కూడా తప్పుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం తమకు గాని, తమ పార్టీకిగాని లేదని, పార్టీ ఎప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ ప్రజలకు మంచి చేయాలని చూస్తుంది తప్పా  ఎవరిని కించపరిచేలా మాట్లాడదని అంబటి పేర్కొన్నారు.  


 తెలుగుదేశం పార్టీ చేసే రాజకీయాలన్ని కూడా దిగజారుడు రాజకీయాలని, వాటిని ఎవరూ కూడా నమ్మరని అన్నారు.  ప్రజలకు మంచి పనులు చేయమని తమకు ప్రజలు అధికారం కట్టబెట్టారని,  ప్రజలకు  ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అంతకు మించి మరొక ఆలోచన ఉండదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. బాబు మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న సంగతి తెలిసిందే.  బాబు మాయ మాటలను ప్రజలు నమ్మడం లేదని అంటున్నారు అంబటి. 

మరింత సమాచారం తెలుసుకోండి: