మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిన చదువుకుంటున్న ప్రతి చోట మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. కనీసం బంధాలకు బంధుత్వాలకు కూడా విలువ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో . అక్క చెల్లి అమ్మ అత్త పిన్ని ఇలా ఎంతో విలువైన బంధాలకు కూడా కామంతో కళ్లు మూసుకుపోయి కనీస విలువ ఇవ్వడం లేదు. రాక్షసుల్లా మీద పడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు  మృగాల్లాంటి  మగాళ్లు . ఇప్పటికే ఇలాంటి ఘటనలు  రోజు కూడా తెరపైకి వస్తూనే ఉన్నాయి . అయితే మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ  మాత్రం మార్పు రావడం లేదు. ఇక్కడ అలాంటి ఘటన చోటు చేసుకుంది, 

 


 18 ఏళ్ళ వయస్సుకే కామవాంఛ తరలిపోయాడు ఇక్కడ ఓ యువకుడు.. ఏకంగా వావి  వరసలు మరిచి తన మేనత్త పైన కన్నేశాడు. తనకు మేనత్త మీద లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వేచి చూశాడు ఈ కామందా  యువకుడు. ఓ రోజు బైక్పై డ్రాప్ చేస్తాను అంటూ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించి పోలీసులకు సమాచారం అందించడంతో కటకటాలపాలయ్యాడు ఆ యువకుడు. వావి వరసలు మరిచి అతి దారుణంగా మేనత్త పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన గురు గ్రామ్  చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువకుడు స్థానిక కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అయితే ఈ యువకుడి మేనత్త ఉద్యోగరీత్యా ఆ యువకుడు ఇంట్లోకి   కొంత కాలం ఆశ్రయం కోసం వచ్చింది. 

 


 కాగా స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో ఆమె ఉద్యోగం చేస్తూ ఉండేది. అయితే సదరు మహిళ తన మేనత్త అని కూడా చూడకుండా ఆమెపై లైంగిక వాంఛను పెంచుకున్నాడు యువకుడు. ఆమెను ఎలాగైనా లైంగికంగా అనుభవించాలని ప్లాన్ వేసాడు. కాగా  ఓ రోజు ఆ మహిళ ఉద్యోగం కి వెళ్తుండగా తాను బైక్ పై  డ్రాప్ చేస్తానంటు నమ్మించాడు  . ఇక బైక్పై ఎక్కించుకుని వెళ్తున్న సమయంలో వాహనాన్ని నిర్మానుష్య ప్రదేశంలో కి తీసుకెళ్ళాడు. ఇక ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ యువకుడు. అయితే ఆ యువకునిపై ప్రతిఘటించిన మహిళ యువకుడి నుండి  తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడి అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: