ఏయ్... రైటరు. కాస్త హెడింగ్ చూసుకో.. అక్కడ ప్రియుడు అని రావాలి. అని కామెంట్ చేయాలనుకున్నారు. కానీ నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వనుగా. సరే ఇంకా అసలు విషయంకు వస్తే.. టిక్ టాక్ గురించి అందరికి తెలిసిందే. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తుంటుంది. ఈ టిక్ టాక్ వల్ల కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు టిక్ టాక్ చేసి బంగారం లాంటి ఉద్యోగాలను పోగొట్టుకుంటారు. 

                  

ఇంకొందరు అయితే ఈ టిక్ టాక్ చేస్తూ ప్రమాదం ఉందనేది కూడా మరిచిపోయి ప్రమాదంలో మరణిస్తారు. ఇలా ఎంతోమంది టిక్ టాక్ కోసం బలైన సందర్భాలు చాల ఉన్నాయి. ఇంకా వివరాల్లోకి వెళ్తే... కర్నూల్ లో ఓ వివాహిత చేసిన పనికి భర్త, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.. ఆమె చేసిన పని వింటే షాక్ అవుతారు. 

                  

టిక్‌టాక్ మోజులో పడ్డ ఓ భార్య.. తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసింది. బెంగళూరుకు చెందిన అంజలి అనే యువతి టిక్‌టాక్‌లో ఆ భార్యకు పరిచయం అయ్యింది. ఈ సమయంలో ఆ యువతి, అర్చన ఇద్దరూ వీడియోలు చేసుకుంటూ ఉండేవారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇంట్లో చెప్పుకుండా ఆ యువతికోసం అర్చన బెంగళూరుకు వెళ్లిపోయింది. 

 

ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది. అయితే.. ఎన్ని రోజులు గడిచిన అర్చన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కర్ణాటక పోలీసులను కర్నూల్ పోలీసులు అప్రమత్తం చేయగా అర్చన ఎక్కడుందో కనిపెట్టి ఆదోని పోలీసులకు అర్చనను అప్పగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: