ఆడవారిపై సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలకు ఓ నిదర్శనం ఇది. ఎవరిని నమ్మాలో...ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. చిన్నా,పెద్ద, వయసును గౌరవించలేని కామం, తప్పు చేస్తున్నామా అనే ఆలోచన కూడా లేని మూర్ఖత్వం...అన్నింటికీ మించిన బలుపుతో దారుణానికి ఒడిగడుతున్న రాక్షసుల తీరు చూస్తుంటే... ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో అలాంటి ఘటనే జరిగింది. ఆ ప్రబుద్ధుడి పేరు గాంధీ. ఓ మహిళకు అల్లుడైన ఆయన ఆమె పట్ల రాక్షసుడిగా ప్రవర్తించాడు. భార్య ఉండగానే...ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం తాగి, అత్తపై లైంగికదాడి చేశాడు.ఆమె అరిచేందుకు యత్నించగా, నోరు మూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిలదీసిన భార్యకు మరో షాకిచ్చాడు.
వణుకు పుట్టించిన బొత్స వ్యాఖ్యలు... రాజధానిపై సంచలన కామెంట్లు
కేరళ రాష్ర్టానికి చెందిన మహిళ (48) కొంతకాలంగా హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని ఓ అపార్టుమెంట్లో కూతురు, అల్లుడు, మనుమడితో కలిసి నివసిస్తున్నారు. కూతురు, అల్లుడు ఉద్యోగానికి వెళ్తుండగా, రెండేళ్ల మనుమడి ఆలనాపాలన చూసుకుంటోంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆమెకు నిత్యం యాంటీడిప్రెసెంట్ మందులతోపాటు నిద్రమాత్ర వేసుకోవడం అలవాటు. గతనెల 13వ తేదీ రాత్రి 11గంటల ప్రాంతంలో, భార్యలేని సమయంలో, మద్యం తాగి వచ్చిన హార్దిక్ గాంధీ నిద్రిస్తున్న అత్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె అరిచేందుకు యత్నించగా, నోరు మూసి అఘాయిత్యానికి పాల్పడి పరారయ్యాడు. మరుసటి రోజు తన కూతురికి చెప్పడంతో ఆమె తన భర్త హార్దిక్గాంధీకి ఫోన్చేసి, ఇంటికి పిలిపించి నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అయితే, దీనికి ఆ దుర్మార్గుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తాను తప్పుచేశానని హార్దిక్ గాంధీ ఒప్పుకున్నాడు. క్షమించాలని వేడుకున్నాడు. త్వరలోనే విడాకులిస్తానని భార్యతో చెప్పాడు. ప్రతినెలా భరణం పంపిస్తానంటూ ఇంటి నుంచి హార్దిక్ గాంధీ వెళ్లిపోయాడు. అయితే, ఆవేశంలో అలా అన్నాడేమో అని ఆమె భావించింది. అయితే...నెలరోజులు గడిచినా తిరిగిరాలేదు. దీంతో బాధితురాలైన మహిళ, ఆమె కుమార్తెతో కలిసి శుక్రవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.