ఆడదానికి ఎన్ని కష్టాలో.. ఒకప్పుడు అత్యాచారానికి గురై ఎవరికీ తెలియకూడదు అని ఆ తల్లి బిడ్డను చెత్త కుప్పల్లో, లేదా పక్కన పడేసి వెళ్ళేది.. కొద్ది కాలానికి ఆడపిల్ల వొద్దు అని భర్త అత్తమామలు కొట్టినచోట కొట్టకుండా కొడుతుంటే భరించలేక కన్నబిడ్డను చెత్త కుప్పలో విసిరేసేవారు.. కానీ ఇప్పుడు ఇదోరకమైన ఘోరం. 

                                

పెళ్లి కాకుండే గర్భవతి అయ్యి.. పుట్టిన మృత శిశువును మురుగు కాలువలో పడేసింది ఓ నీచమైన యువతి.. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో చోటు చేసుకుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. 

                          

ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు గర్భంలోనే మృతి చెందడంతో మురుగు కాలువలో పడవేసినట్లు తెలిసింది. అయితే శుక్రవారం ఉదయం స్థానికులు మురుగు కాలువలో పడి ఉన్న శిశువును చూసి పోలీసులకు సమాచారం అందించారు. 

                      

దీంతో స్థానిక ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటా వెళ్లి సర్వే చెయ్యగా అనారోగ్యంతో ఉన్న ఆ యువతిని గుర్తించి నిలదీశారు. దీంతో  జరిగిన విషయం ఆ యువతీ అధికారులకు, పోలీసులకు తేల్చి చెప్పింది. దీంతో ఆ యువతిని ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. కాగా ఆ యువతికి గర్భం ఎలా వచ్చింది.. ఎవరి వల్ల వచ్చింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: