ఏంటో.. ఈ మధ్యకాలంలో అన్ని విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. రోజుకో విచిత్ర ఘటన. ఎంత కాదు అనుకున్న సరే.. ఏదో ఒక రకమైన వింత.. ప్రతిరోజు షాక్ అవ్వాల్సి వస్తుంది.. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని. సరే ఇంకా వివరాల్లోకి వస్తే.. కర్నూల్ జిల్లా నంద్యాలలో కూడా ఓ విచిత్రమైన ఘటన జరిగింది. 

                           

ఆ విచిత్ర ఘటన ఏంటంటే.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మృతదేహాన్ని తీసుకొని బంధువులు పరారవ్వడం.. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. కర్నూలు జిల్లా దొర్నపాడు మండలం గోవిందిన్నేకు చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

                        

ఏమైందో తెలియదు... కాసేపటి తర్వాత మృతుడి తండ్రి, బంధువులు నేరుగా నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. తమ కుమారుడికి పోస్ట్‌మార్టమ్ అవసరం లేదని ఆస్పత్రి సిబ్బందితో తండ్రి గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆతర్వాత యువకుడి బంధువులు ఆస్పత్రి సిబ్బందికి తెలియకుండా మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి బైక్‌పై తీసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. 

                   

అయితే అక్కడే ఉన్న పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అడ్డొచ్చిన వాళ్లను పక్కకు తోసేసి.. యువకుడి మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: