రోజా ఎం చేసిన సంచలనమే.. ఈ విషయం అందరికి తెలుసు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్యే రోజు ఉల్లిపాయలు అమ్మారు. తన సొంత నియోజకవర్గం అయినా నగరిలోని పుత్తూరు మార్కెట్ యార్డ్‌లో ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తున్న ఉల్లి విక్రయాలను పరిశీలించారు. ఉల్లిపాయలు పరిశీలించడానికె అక్కడికి వచ్చిన రోజా.. మహిళలను పలకరిస్తూ.. ఎంతో మంచిగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ మాట కలిపారు. 

                                                            

అనంతరం అక్కడే రోజా స్వయంగా.. ఆ మహిళల దగ్గర ఆధార్ కార్డులు తీసుకుని ఉల్లిపాయలను అమ్మారు. అయితే ఆ ఉల్లిపాయలు కేజీకి రూ.25 చొప్పున ఆమె అమ్మారు. అసెంబ్లీ సమావేశాలతో గత నాలుగైదు రోజులు నుంచి ఎమ్మెల్యూ అందరూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో అందరూ సొంత నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. 

                                              

ఈ నేపథ్యంలోనే రోజా కూడా నగరి నియోజకవర్గానికి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్థానిక సమస్యల్ని తెలుసుకున్నారు. అనంతరం సాయంత్రం మార్కెట్ యార్డ్‌లో పర్యటించి ఉల్లిపాయలు అమ్మారు. కాగా అయేషా మీరా తల్లి నేడు ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అయేషా మీరా తల్లి వ్యాఖ్యలకు స్పందించి ఇలా మాట్లాడటం సరికాదు అని.. నిజానిజాలు తెలుసుకోవాలి అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: