ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. 'ఏపి దిశ చట్టంపై కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. మహిళలు, పసి పిల్లలపై ఘోరాలు జరిగితే ప్రచారం కోసం వాడుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు ఏనాడు కఠిన చట్టాలు తేలేదు. ఈ యాక్ట్ వల్ల నేరగాళ్లకు 21 రోజుల్లోనే ఉరికంబం ఎక్కుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఇచ్చిన భరోసా మహిళల్లో ఎంతో ధైర్యం నింపింది.'' అంటూ #APDishaAct అనే హ్యాష్ టాగ్ చేశారు విజయసాయి రెడ్డి.
నీ హయాంలో ఏనాడైనా ఈ ఒక్క నిందితుడునైనా శిక్షించవా? కానీ ఒక కఠిన చెట్లన్నీ తెచ్చావా ? అంటూ ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు చంద్రబాబు.. అతని హయాంలో ఎవరికీ న్యాయం చెయ్యలేదు.. ఒక్క ప్రజలకే కాదు అంటూ ట్విట్ చేశారు నెటిజన్లు. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపి దిశ చట్టంపై కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి.మహిళలు,పసి పిల్లలపై ఘోరాలు జరిగితే ప్రచారం కోసం వాడుకోవడం తప్ప @ncbn ఏనాడు కఠిన చట్టాలు తేలేదు.ఈ యాక్ట్ వల్ల నేరగాళ్లకు 21 రోజుల్లోనే ఉరికంబం ఎక్కుతారని @ysjagan గారు ఇచ్చిన భరోసా మహిళల్లో ధైర్యం నింపింది. #APDishaAct
— Vijayasai reddy V (@VSReddy_MP) December 14, 2019