ఏంటో.. ఈ మధ్యకాలంలో అన్ని విచిత్ర విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. రోజుకో విచిత్ర ఘటన. ఎంత కాదు అనుకున్న సరే.. ఏదో ఒక రకమైన వింత.. ప్రతిరోజు షాక్ అవ్వాల్సి వస్తుంది.. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని. సరే ఇంకా వివరాల్లోకి వస్తే..జైపూర్ లో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఆ ఘటన వింటే.. వామ్మో.. ఇది పిల్ల కాదు రాక్షసి అని అంటారు.  

 

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని చాక్సూ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 11న ఓ దారుణం జరిగింది. ఓ పదేళ్ల విద్యార్థిని స్నేహితురాలి పెన్నును ఆమెకు తెలీకుండా తీసుకుంది. ఈ విషయం తెలిసిన ఆ స్నేహితురాలు తన పెన్ను కోసం ఆ బాలిక ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు బాలికల మధ్య పెన్ను కోసం జరిగిన గొడవలో కోపంలో ఆ 10 ఏళ్ళ బాలిక తన 12 ఏళ్ళ స్నేహితురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి చంపింది. 

 

అయితే కూతరు హత్య చేసిందని తెలుసుకున్న ఆమె తల్లి, కుమార్తె స్నేహితురాలి మృతదేహానికి రాయి కట్టి చెరువులో పారేసింది. భర్త వచ్చిన తరువాత జరిగిన సంగతి చెప్పింది. దీంతో ఇంకా అందరూ కలిసి చెరువులోని మృతదేహాన్ని బయటకు తీసి ఓ నిర్మానుష్య ప్రదేశంలో పారేశారు.    

 

అయితే వారి కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు ఆ చిన్నారి మృతుదేహం లభించింది. అయితే ఆ చిన్నారి ఎలా మరణించింది.. మరణించే ముందు ఎక్కడికి వెళ్ళింది అని  దర్యాప్తు చెయ్యగా నిందితులు అందరూ బయటపడ్డారు. అయితే హత్య చేసింది 10 ఏళ్ళ పాప అని తెలుసుకొని పోలీసులు ఇది పిల్ల కాదు రక్షేసి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: