రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్ నివేదికలో పోలీసులు నిందితులు దిశకు మద్యం తాగించి అత్యాచారం చేసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక తరువాత నిందితులకు దిశ కేసుతో మాత్రమే కాకుండా మరికొన్ని కేసుల్లో కూడా ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
పోలీసులు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు కొన్ని బృందాలను పంపారు. ఫోరెన్సిక్ నిపుణులు రిపోర్టులోని వివరాలు గతంలో జరిగిన కొన్ని నేరాలతో మ్యాచ్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన రోజున సీపీ సజ్జనార్ హైవేలపై గతంలో నిందితులు నేరాలు చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫోరెన్సిక్ నిపుణులు దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. 
 
పోలీసులు నాలుగు రాష్ట్రాల్లోని మిస్సింగ్ కేసులకు నిందితులకు సంబంధం ఉందా..? లేదా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలను ఆరు రాష్ట్రాలకు పంపినట్లు తెలుస్తోంది. గతంలో హైవేలపై జరిగిన దిశ లాంటి ఘటనల గురించి కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితులపై వారి స్వగ్రామాల్లో కొన్ని కేసులు నమోదు అయినట్లు వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు ఇప్పటికే టోల్ గేట్ సమీపంలోని వైన్ షాప్ లో నిందితులు మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అత్యాచారం చేయడానికి ముందే దిశకు మద్యం తాగించినట్లు దిశ అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దిశ ఘటన జరిగిన రోజు ఉదయం నుండి రాత్రి వరకు నిందితులు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా నిందితులు దిశ లాంటి ఘటనలకు పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తుండగా విచారణలో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: