లోకంలో ఇలాంటి వార్తలు ఎప్పుడు విన్న.. సమాజంలో మనుషులు  ఎటువైపు పోతున్నారా అనే ఆందోళన కలుగుతుంది. మరోవైపు ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? అని ఆశ్చర్యమేస్తుంది. పెన్సిల్వీనియాలోని బెర్క్స్ కౌంటీలో చోటుచేసుకున్న ఈ మిస్టరీ ఘటన గురించి తెలిస్తే.. తప్పకుండా గుండె బరువెక్కుతుంది. ఎందుకంటే విలువల్ని మరచిన మనిషి తన స్వార్దం కోసం బ్రతకడానికి అలవాటు పడ్డాడు. తనలో రగిలే కోరికల్ని ప్రకృతి విరుద్దంగా నెరవేర్చు కుంటున్నాడు. తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు.

 

 

ఇకపోతే పెన్సిల్వీనియాలోని బెర్క్స్ కౌంటీ లో ఉండే లిసా రాచెల్లే స్నేడర్ (36) అనే మహిళ సెప్టెంబరు 23న తన బిడ్డలిద్దరూ బేస్‌మెంట్‌లో ఉరి వేసుకున్నారని, తనకు ఏం చేయాలో అర్థం కావడంలేదంటూ ఏడుస్తూ  911 అనే ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసి చెప్పింది. దీంతో ఎమర్జెన్సీ సిబ్బంది హుటాహుటిన ఘటన స్దలానికి చేరుకుని పిల్లలను రక్షించారు. కానీ, బ్యాడ్ లక్.. కొద్ది రోజులు హాస్పిటల్‌లో వెంటిలేటర్‌ సాయంతో బతికిన ఆ చిన్నారులు మూడు రోజుల తర్వాత తుది శ్వాస విడిచారు.

 

 

ఆ చిన్నారుల మరణం తర్వాత పోలీసులు లిసాను విచారించారు.. అసలు నిజాన్ని దాచి ఓ కట్టు కధ అల్లింది లిసా.. అదేమంటే తన కొడుకు కాన్నర్ డిప్రషన్‌తో బాధపడుతున్నాడని. తాను ఒంటరిగా చనిపోతానేమో అని భయమేస్తోందని, చెల్లిని కూడా చంపేస్తానని అనేవాడని, చివరికి భయపడినట్లే చేశాడని తెలిపింది. ఇక ఎనిమిదేళ్ల వయస్సున్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా అరుదని భావించిన పోలీసులు అనుమానస్పదంతో ఆ చిన్నారులను కావాలనే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తూ చేయగా దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి..

 

 

అదేమంటే తన ఒంటరి జీవితాన్ని లిసా పెంపుడు కుక్కతో పంచుకుందని ఈ సందర్భంగా ఆమె కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లో కొన్ని ఆధారాలు లభించాగా వాటిని పరిశీలిస్తే. ఆమె కుక్కతో సెక్స్ జరిపేదని, ఆ ఫొటోలను తన స్నేహితులకు పంపేదని పోలీసుల పరిశీలనలో తేలిందట.. ఈ కారణంగానే కుక్కతో అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని ఈ హత్య లిసా చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఆమె నోరు విప్పితేగానీ అసలు విషయం బయటపడదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: