ఈ కలికాలంలో జరిగే వింత వింత సంఘటనల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారనే విషయం అందరికి తెలిసిందే. వారు చెప్పినట్లే లోకంలో జరుగుతున్న ఆశ్చర్యపోయే వింత ఘటనలు చూస్తే ముక్కున వేలేసుకోని వారుండరు. ఇక కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగాయి. ఇదే కోవకు చెందిన మరో వింత ఘటన ఏపిలో జరిగింది.

 

 

ఓ జంటకు వింత శిశువు జన్మించింది. చాలా అరుదుగా జరిగే ఘటనగా వైద్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్లితే. శుక్రవారం రాత్రి గర్భిణికి వింత శిశువు జన్మించింది. ఇదెక్కడ జరిగిందంటే బాపట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకున్న సంఘటన.. ఇకపోతే ఓ మహిళ ఆస్పత్రిలో ప్రసవం కాగా ఆమెకు పుట్టిన శిశువుకు మూడు చేతులు ఉన్నాయి. కాగా చెవులు, ముక్కు సరిగా లేవు. ఇక ఈ శిశువు తాలుకు బందువులు, కుటుంబ సభ్యులు వీరి పూర్తి వివరాలు వెల్లడించటానికి  నిరాకరించారు.

 

 

ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించగా అక్కడి వైద్యురాలు మాట్లాడుతూ దంపతులది మేనరిక వివాహమని, జన్యుపరమైన లోపాల వల్లే ఇలాంటి శిశువు జన్మించిందని తెలిపారు. ఐదో నెలలో స్కానింగ్‌ చేయించినా లోపాన్ని వైద్యులు గుర్తించలేక పోయారన్నారు. ఎనిమిదో నెలలో తెలిసినా గర్భస్రావం చేయటానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ఇకపోతే సాధారణ కాన్పులోనే జన్యు లోపాలతో శిశువు జన్మించిందని వివరించారు.

 

 

ఇక మూడు చేతులతో పుట్టిన శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బతికే అవకాశాలు చాలా తక్కువని డాక్టర్లు తెలుపు తున్నారు. ఈ దంపతులకు ఇలా జరగడం ఇదేమి మొదటిసారి కాదని, మూడేళ్ల క్రితం మొదటి కాన్పులో కూడా కాళ్లు, చేతులు లేకుండా మగబిడ్డ పుట్టి చనిపోయాడని వైద్యురాలు పేర్కొన్నారు.

 

 

ఇక మేనరికాలు చేసుకోవద్దని ఎప్పటి నుండో వైద్య నిపుణులు చెబుతున్నా ఇంకా అక్కడక్కడ ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయి. వీటి వల్ల పుట్టే పిల్లలు ఇలా అంగవైకల్యంతో పుడితే కన్న వారికి చివరికి మిగిలేది మానసిక క్షోభ తప్పితే వారి జీవితంలో ఆనందం ఉండదు అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: