రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' ( కమ్మ రాజ్యంలో కడప రెడ్లు) సినిమా  డిసెంబర్ 12న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను నెగిటివ్‌గా చూపించడంతో జనసైనికులు ఫైర్ అవుతున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పెద కర్మ నిర్వహించారు జనసైనికులు. వర్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ‘జోహార్ ది బాస్టర్డ్’ అంటూ ఆయనపై ఉన్న ఉక్రోషాన్ని వెళ్లగక్కారు కోడూరు పాడు జనసేన యూత్. 
 
తమ నాయకుడ్ని పోలిన వ్యక్తి క్యారెక్టర్‌తో తమను అవమానించారని దీనికి నిరసనగా వర్మను సోషల్ మీడియాలో విమర్శిస్తూ  బండబూతులు తిడుతున్నారు జనసైనికులు. అంతటితో ఆగకుండా.. కోడూరుపాడు జనసేన యూత్ సభ్యులు వర్మకు పెద కర్మ నిర్వహిస్తున్నట్టుగా ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

 

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా  రిలీజ్ రోజు అనగా డిసెంబర్ 12న వర్మ చనిపోయాడని.. డిసెంబర్ 26న ఆయన పెద కర్మ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూరకూడదని భవవంతున్ని ప్రార్ధిస్తూ జనసేన యూత్- కోడూరు పాడు’ అంటూ భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోహార్ బాస్టర్డ్ అంటూ వర్మను ఏకిపారేస్తున్నారు జనసైనికులు. 

 

కాగా.. తన పెదకర్మ, శ్రద్ధాంజలి ఫ్లెక్సీపై వర్మ స్పందిస్తూ అదే పోస్టర్‌ను తన ఫేస్ బుక్‌,ట్విట్టర్ లో షేర్ చేసి జనసైనికులను చల్లపరిచే ప్రయత్నం చేస్తూనే రెచ్చగొట్టాడు. ‘దయచేసి అర్ధం చేసుకోండి.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా జస్ట్ ఫన్ కోసం మాత్రమే తీశా. నేను గాడ్ ప్రామిస్‌గా చెప్తున్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబులను ప్రేమిస్తున్నా. వాళ్ల ఫాలోవర్స్ మీద ఒట్టు.. ముఖ్యంగా కోడూరుపాడు జనసేన ఫాలోవర్స్‌ మీద ఒట్టేసి చెబుతున్నా నమ్మండి’ అంటూ సెటైర్లు వేశాడు రామ్ గోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: