మన దేశంలో మనిషి టెక్నీకల్ గా మరియు ఇతర పలు రంగాల్లో ఎంతో గొప్పగా రోజు రోజుకు ముందుకు దూసుకెళ్తున్నాడు. కానీ రాను రాను మన మనుషుల్లో కొందరి బుద్ధి మాత్రం పెడత్రోవ పట్టడంతో పాటు, క్షణిక సుఖం కోసం అభం శుభం తెలియని అమ్మాయిల జీవితాలను నాశనం చేసే నీచ స్థితికి దిగజారుతోంది. ఇటీవల మన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి రేప్, హత్యోదంతాన్ని మరువక ముందే, మళ్ళి అక్కడక్కడా దేశంలో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. 

 

ఇక ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ ఘటన గురించి వింటే, ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోవడంతో పాటు నిందితుడిపై పట్టరాని ఆవేశం రాక మానదు. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఒక కుగ్రామంలో తన పెదనాన్న కుమారుడితో సహా ఆరు బయట నిద్రిస్తున్న ఒక మతిస్థిమితం లేని యువతని, అక్కడి స్థానిక యువకుడు ఒకడు, నడి రాత్రి సమయంలో ఆమెను నిద్రలేపి, ఎవరూ లేని నిర్మానుష్యమైన చోటికి తీసుకెళ్లి ఘోరంగా అత్యాచారం చేసాడు. కాగా కాసేపటికి కళ్ళు తెరిచి చూసిన ఆమె అన్నయ్యకు, సోదరి కనపడకపోవడంతో కొంత అనుమానం వచ్చి, 

 

ఇరుగుపొరుగు వారిని పిలుస్తూ కేకలేశాడు. వెంటనే చుట్టుప్రక్కల వారందరూ కలిసి ఊళ్లోని పలు ప్రాంతాల్లో వెతకసాగారు. కాగా కాసేపటి తరువాత మతిస్థిమితం లేని యువతి ఒక మారుమూల ప్రదేశంలో నగ్నంగా పడి ఉండడం గమనించి వేంటనే ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఒక యువకుడు తనపై అత్యాచారం చేసాడని యువతి చెప్పడంతో, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నేడు ఎంతో సంచలనం రేపుతోంది. కనీసం మతి స్థిమితం లేని అమ్మాయి అనే కనికరం కూడా లేకుండా ఆ విధంగా అత్యాచారానికి పాల్పడిన యువకుడిని వీలైనంత త్వరలో పట్టుకుని శిక్షిస్తాం అని పోలీసులు చెప్పినట్లు సమాచారం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: