దిశ హత్యాచార ఘటనకు ముందే, సమత హత్యాచార ఘటన జరిగింది . కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం లో ఈ ఘటన చోటు చేసుకుంది . బాధితురాలి పేరు సమత గా మార్చి పోలీసులు దర్యాప్తు చేపట్టారు . ఈ కేసులో 44 మంది సాక్షులను విచారించి, 96 పేజీల నివేదిక ను పోలీసులు సిద్ధం చేశారు . దిశ హత్యాచార ఘటన నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చగా , సమత నిందితులు సోమవారం నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ఎదుర్కోనున్నారు .
పోలీసులు పకడ్బందీగా రూపొందించిన నివేదిక ప్రకారం నిందితులకు ఉరిశిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది . ఇక నిందితుల తరుపున ఎవరు వాదించరాదని జిల్లా బార్ అసోసియేషన్ నిర్ణయించడం పరిశీలిస్తే , నిందితులకు ఉరి తప్పకపోవచ్చుననే వాదనలు బలపడుతున్నాయి . సమత పై నిందితులు అత్యాచారం చేసిన అనంతరం కత్తి పొడిచి , బండరాయి తో మోది అత్యంత క్రూరంగా హత్య చేశారు .
ఈ కేసులో నిందితులైన షేక్ బాబు , షాబుద్దీన్ , ముగ్దుమ్ లు బాధితురాలు కదలకుండా కాళ్ళు, చేతులు పట్టుకుని ఒకరి తరువాత మరొకరు అత్యాచారం చేయడమే కాకుండా , షేక్ బాబు ఆమెను కత్తి తో పొడవగా , మిగిలిన ఇద్దరు బండరాయి తో తలపై మోదినట్లు పోలీసులు తమ నివేదిక లో పేర్కొన్నారు . బాధితురాలు చేతులు నరకడం తో బాధతో విల, విలలాడుతున్న నిందితులు అదేమీ పట్టించుకోకుండా , బ్రతికి ఉంటే తమ పేరు బయటకు చెబుతుందన్న ఏకైక కారణం తోనే బండరాయి మోది హత్య చేశారని వెల్లడించారు . ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో నిందితులకు ఎంత త్వరగా శిక్ష ఖరారు అవుతుందనేది హాట్ టాఫిక్ గా మారింది .