రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా ఎక్కువగా నేరాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. గతంలో సురేష్ అనే వ్యక్తి తహసిల్దార్ విజయ రెడ్డి కార్యాలయంలోకి వెళ్లి పెట్రోల్ బాటిల్ తో తహసిల్దార్ విజయ రెడ్డిని సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా కలకలం రేపింది. రెవెన్యూ సిబ్బంది అందరిని ఉలిక్కిపడేలా చేసింది విజయసాయిరెడ్డి సజీవదహనం ఘటన. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ పుర్రె శరీర భాగాలు బయటపడడం ప్రస్తుతం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తీసుకొచ్చిణ వ్యక్తి ఇసుకలో అన్ లోడ్ చేస్తుండగా లారీలో నుంచి గుర్తు తెలియని మహిళ పుర్రే శరీర భాగాలు బయట పడటంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మహిళ శరీర భాగాలు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం అబ్దుల్లాపూర్మెట్ నుంచి ఇసుక ను కొనుగోలు చేశాడు. లారీ లో వచ్చిన ఇసుక ఆ వ్యక్తి ఇంటి వద్ద అన్లోడింగ్ చేస్తున్న సమయంలో.. ఆ లారీ లో నుంచి గుర్తు తెలియని మహిళ పుర్రె శరీర భాగాలు బయటపడ్డాయి. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పుర్రె శరీర భాగాలు చూసిన ఆ వ్యక్తి హుటాహుటిన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
కాగా ఆ వ్యక్తి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీం తో వచ్చే అక్కడ తనిఖీలు చేశారు. ఆ గుర్తు తెలియని మహిళ యొక్క పుర్రె ఇతర శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే మృతురాలి వయసు 25 సంవత్సరాల నుండి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పుర్రె ఇతర శరీర భాగాలు బయటపడడంతో స్థానికంగా ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. కాగా మహబూబ్నగర్ నుండి 8 నెలల క్రితం తాము తీసుకువచ్చిన ఇసుకను డంప్ చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.