ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అతని తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. ఎప్పుడు ట్విట్టర్ లో ప్రతిపక్ష నేతలను కడిగి పారేసే విజయసాయి రెడ్డి ఈరోజు నారా లోకేష్ పై కూడా దారుణంగా కామెంట్లు చేశారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''అసెంబ్లీలో మొహం చెల్లక పోవడంతో ప్రచారం కోసం గేటు దగ్గర గలాభా సృష్టించాలని చూశాడు. లక్షల కోట్లు దోచుకున్న పొగరుతో మాలోకం మార్షల్ గొంతు పట్టుకని దుర్భాషలాడిన వీడియోలు అందరూ చూశారు. ప్రచారం కోసం ఇలాంటి ఛీప్ ట్రిక్కల మీద ఎన్నాళ్లు చంద్రబాబు, నారాలోకేష్'' అంటూ @ncbn, @naralokesh వారి ట్విట్ ఖాతాలను జత చేశారు విజయసాయి రెడ్డి.  

 

దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు ఈ ట్విట్ పై కామెంట్ చేస్తూ.. మాలోకం అంతేలెండి.. ఛీప్ ట్రిక్స్ ప్లే చెయ్యడం మాములే.. మీరు పట్టించుకోకండి అంటూ ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా వైసీపీ, టీడీపీ పార్టీల అభిమానుల మధ్య ఈ ట్విట్ తో ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: