ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''చంద్రబాబు నాయుడు అవినీతి బయట పడకుండా కిరసనాయిలు రోజుకో అసత్య కథనాన్ని రాస్తాడు. బాబు దాన్ని చూపిస్తూ... చూశారా ఎన్ని కుట్రలు చేస్తున్నారో అని అమాయకత్వం నటిస్తాడు. బాబు బండారమంతా బయటపడిన రోజున ఎవరూ తప్పించుకోలేరు కిరసనాయిలుతో సహా.'' అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు.
చంద్రబాబు నాయుడు అవినీతి బయటపడకుడు అని.. రోజు ఎన్నో అసత్య కథనాలు రాస్తారు అని.. ఆ అసత్య కథనాలు చూపించి ఎన్ని కుట్రలు చేశారో చూశారా ? అంటూ అమాయకమైన ముఖం పెట్టి ప్రజల ముందుకు వస్తాడు అని.. త్వరలోనే బాబు బండారం బయట పడుతుంది అని ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా వైసీపీ, టీడీపీ పార్టీల అభిమానుల మధ్య ఈ ట్విట్ తో ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది.
@ncbn అవినీతి బయట పడకుండా కిరసనాయిలు రోజుకో అసత్య కథనాన్ని రాస్తాడు. బాబు దాన్ని చూపిస్తూ... చూశారా ఎన్ని కుట్రలు చేస్తున్నారో అని అమాయకత్వం నటిస్తాడు. బాబు బండారమంతా బయటపడిన రోజున ఎవరూ తప్పించుకోలేరు కిరసనాయిలుతో సహా.
— Vijayasai reddy V (@VSReddy_MP) December 15, 2019