జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి వైసిపి ప్రభుత్వంపై టీడీపీ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీ నేత కూన రవికుమార్ వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం నిలబెట్టుకుంటా మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు . ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు టీడీపీ నేత కూన రవికుమార్. శ్రీకాకుళంలో తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత కూన రవికుమార్ జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. 

 

 

 ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిజ స్వరూపం క్రమక్రమంగా బయటపడుతుందని.. టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపించారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో  ఎప్పుడు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిప లేదా అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీస్తారు టీడీపీ నేత కూన రవికుమార్. ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే  వెకిలి నవ్వులు నవ్వుతూ... ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇస్తున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు . 

 

 

 ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర మంత్రులు అందరూ ప్రవర్తిస్తున్న తీరు వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అంటూ టీడీపీ నేత రవి కుమార్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో స్పీకర్ ఉండి కూడా లేనట్లే ఉంటుందని... కళ్ళులేని దృతరాష్ట్రుడిలా  స్పీకర్ అసెంబ్లీ లో వ్యవహరిస్తున్నారంటూ తమ్మినేని సీతారాం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూన రవికుమార్. అసెంబ్లీలో సభ అధ్యక్షునిగా ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్షానికి కొమ్ము కాస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను  అడ్డుకునే అధికారం అసెంబ్లీ మార్షల్స్ కు  ఉందా లేదా అనే విషయం స్పీకర్ వెల్లడించాలని టీడీపీ నేత కూన  రవి కుమార్ డిమాండ్ చేసారు .

మరింత సమాచారం తెలుసుకోండి: