లోక్‌సభ ఎన్నికలకు ముందు అర్వింద్ పసుపు బోర్డు తీసుకొస్తానని ప్రకటించారు. లేదంటే, తన పదవికి రాజీనామా చేసి రైతులతో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బాండ్ పేపర్ మీద రాశారు. దీంతో అర్వింద్ యూటర్న్ తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పసుపు బోర్డు సాధన సమితి కూడా ఎంపీపై దుమ్మెత్తిపోస్తోంది. ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆయన రాజీనామా చేస్తే...పసుపు బోర్డు అదే వస్తుందని రైతులు చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థి రాజీనామా చేయడం ద్వారా దేశ వ్యాప్త చర్చ జరుగుతుందని అప్పుడు కేంద్రం దానికదే దిగివస్తుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

పసుపు బోర్డు కోసం నిజామాబాద్ రైతులు ఏళ్లుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆదివారం ఈ అంశంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పసుపు బోర్డు రాదని తేల్చేశారు. అయితే, అంతకుమించి ప్రయోజనాలున్న పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. 
 
నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పసుపు బోర్డు కింద పంటను నియంత్రించడం.. మద్దతు ధర కల్పించడం, పంటను ప్రమోట్ చేయడం, సబ్సిడీపై రుణాల కోసం బ్యాంకులతో చర్చలు జరపడం, పండించేందుకు అధునాతన పరికరాలు సమకూర్చడం వంటి పనులు పసుపు బోర్డు ద్వారా నెరవేరతాయి. పంట చేతికందాక దాన్ని విక్రయించే బాధ్యత కూడా బోర్డు పరిధిలోనే ఉంటుంది. టైస్ పథకం గురించి కేంద్రంతో అన్ని చర్చలు ముగిశాయి. ఇక దీని అమలు ప్రక్రియ మొదలైంది. నా అంచనా ప్రకారం మరో 10 నుంచి 15 రోజుల్లో నన్ను ఢిల్లీకి పిలిచే అవకాశముంది. మొత్తానికి సంక్రాంతి పండుగకు ముందో తర్వాతో మనకు శుభవార్త రావొచ్చు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేంద్రానికి పంపాల్సి ఉంది. దీని గురించి ఇప్పటికే 6 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాను. మళ్లీ రేపు లేఖ కూడా రాయబోతున్నాను.’’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: