ఇటీవల కాలంలో మనిషి అన్ని విధాలుగా ఎంత ముందుకు పోతున్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం తన నీచమైన ప్రవర్తనతో మానవతా విలువలను కోల్పోవడంతో పాటు, బంధాలు అనుబంధాలకు కూడా తిలోదకాలిస్తూ తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నాడు. ఇక డిజిటల్ మాధ్యమాల పుణ్యమా అని యువత మరింతగా పెడ త్రోవ పడుతున్నారు అనడానికి మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనే ఒకింత ఉదాహరణ. వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని శివకాశి ప్రాంతంలో మురుగేశన్, గణేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కాగా వారి ఇంటికి కొంత దూరంలో ఉన్న ఇంటికి కొత్తగా అద్దెకు వచ్చిన ఒక అమ్మాయిని చూసి, మెల్లగా ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెతో పరిచయం పెంచుకున్నారు. 

 

అయితే వారిద్దరితోనూ పరిచయం ఏర్పరుచుకున్న ఆ యువతి, వారితో మరింత చనువుగా ఉండడం మొదలెట్టింది. అనంతరం వారి పరిచయం అక్రమ సంబందానికి దారి తీసింది. ఆ విధంగా వారిద్దరూ ఒకరి గురించి మరొకరికి తెలియకుండా ఆమెతో అక్రమ సంబంధాన్ని కొనసాగించడంతో పాటు ఇద్దరూ కూడా ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెకు భారీగా  నగదు,డబ్బు ముట్టజెప్పడం మొదలెట్టారు. అయితే అదే సమయంలో ఇటీవల ఒక రోజు సడన్ గా ఆ యువతి అనుకోకుండా ఊరు విడిచి వెళ్లిపోవడంతో, ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఎంతో దిగాలు చెందారు. కొద్దిరోజలుగా ఆమె ఇంటి వద్దకు వచ్చి వెళ్తున్న ఆ యువకులకు ఆమె జాడ మాత్రం తెలియలేదు. 

 

అయితే చివరకు ఒకరోజున ఆమె జాడ కనుక్కోవడానికి ఆమె ఇంటికి వద్దకు అనుకోకుండా వచ్చిన ఆ ఇద్దరు అన్నదమ్ములూ కూడా ఒకరికొకరు ఎదురుపడడం జరిగింది. దానితో జరిగిన ఘటనను ఎవరికి వారు బహిర్గతంగా చెప్పుకుని షాక్ అయ్యారు. కాగా అదే సమయంలో ఊరు నుండి వచ్చిన ఆ ఇంటి ఓనర్, ఇల్లు విడిచి వెళ్ళిపోయిన యువతి ఇంటి అద్దె నిమిత్తం ఆరు నెలల బాకీ ఉందని, మొన్న రాత్రికి రాత్రి హఠాత్తుగా తాను ఇంట్లో లేని సమయంలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా ఆ ఇద్దరు అన్నదమ్ముల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. ఇక ఈ విషయం తెలుసుకున్న యువకుల తల్లితండ్రులు, ఇకపై ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని, క్షణిక సుఖం కోసం విలువైన బంధాలను కాలరాసుకోవద్దని వారిద్దరికీ గట్టిగా బుద్ధి చెప్పారట. కాగా ఈ ఘటన శివకాశి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొద్దిరోజులుగా విస్తృతంగా ప్రచారం అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: