మన భారతదేశం పసిడి ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బంగారం ధరలు తగ్గాయి అంటే చాలు.. ఆస్తులు అమ్మి ఆయిన సరే బంగారం కొనేయాలనుకుంటారు. అయితే మొన్నటి వరుకు తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్ళి భారీగా పెరిగాయి. ఒకరోజు బంగారం ధర భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. 

                   

గత నెల వరుకు భారీగా పెరిగిన బంగారం ధర వరం రోజుల నుండి తగ్గుముఖం పట్టింది. అయితే ఈరోజు మళ్ళి ఎదావిధంగా పెరగడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 310 రూపాయిల పెరుగుదలతో 39,500 రూపాయలకు చేరింది. 

                      

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 310 పెరుగుదలతో 36,220 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర స్థిరంగా కొనసాగింది. దీంతో కేజీ వెండి నేడు 46,700 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

                     

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1,467.85 డాలర్లకు పుంజుకుంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: