తెలుగు ఇండస్ట్రీలో ఒకే నెలలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న భామ రాశి ఖన్నా. ఈ నెల 13న వెంకీ మామ సినిమాతో మన అందరి ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ. మళ్ళీ 20 వ తారీఖున ప్రతి రోజు పండగే సినిమాతో మన అందరి ముందుకు వస్తుంది ఈ క్రేజీ భామ. ఈ సినిమాలో టిక్ టాక్ కి బానిస అయిన పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే నిన్న సాయంత్రం ఈ అమ్మడు నటిస్తున్న మరో చిత్రం మొదటి లుక్ వచ్చింది. విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. పంజాబ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో బాగానే సెటిల్ అయింది అని చెప్పాలి.

 

 ఇప్పుడు తాజాగా జరిగిన దిశ సంఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన చట్టం తీసుకొని వచ్చింది. ఎటువంటి సంఘటన జరిగిన  మూడు వారాలు లోపల న్యాయం జరిగేలాగా చట్టం తీసుకొని వచ్చారు జగన్. దీనిపై రాశి ఖన్నా ఎంతగానో సంతోషించి ఈ విధంగా స్పందించారు.

 

ఇలాంటి చట్టాలు రావాలని ఆమె అన్నారు. ఈ విషయంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసల వర్షం కురిపించింది. దిశ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సత్వరమే శిక్ష పడే ఇలాంటి చట్టాలు అవసరమని రాశీ పేర్కొంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లకు కఠినశిక్షలు విధించేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాశి ఖన్నా స్వగతించింది.

 


 రాశితో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ బిల్లుపై ఎంతో హర్షం వ్యక్తం చేశారు. తప్పు చేయాలనే ఆలోచన వచ్చే వాళ్ళకి భయం కల్పించే లాగా చట్టం ఉండాలని చెబుతోంది. దిశ చట్టం విషయంలో ఏపీ ప్రభుత్వం చూసి అన్ని ప్రభుత్వాలు ఎంతో నేర్చుకోవాలని ఆయన మీద ప్రశంసలు కురిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: