ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు పెద్దలు. ఎందుకంటే ఉల్లి తినడం వల్ల అన్ని లాభాలు ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయ వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు పోతాయి.. రావు. అయితే ఈ ఉల్లిపాయ ధరలు నిన్నటి భారీగా పెరిగాయి. ప్రతి ఒక్కరికి ఈ ఉల్లి మంట బాగా అంటుకుంది. ఇంకా కొంతమంది అయితే ఈ ఉల్లిపాయని కొనడానికి ప్రయత్నించి ప్రయత్నించి గుండెపోటు వచ్చి మరణించారు.
ఇంకా కొంతమంది మహిళలు అయితే ఉల్లి రాయితీ కేంద్రాల ముందు జుట్టు ఊడిపోయేలా కొట్టుకున్నారు. ఆ కొట్టుకోవడం చూస్తే బాబోయ్ అని ఆశ్చర్య పోవాల్సిందే. అలా కొట్టుకున్నారు ఆ మహిళలు. అయితే ఇక అలాంటి కష్టాలన్నింటికీ ఈరోజుతో చెక్ పడింది. హైదరాబాద్లోని ప్రధాన హోల్సేల్ మార్కెట్లకు భారీఎత్తున ఉల్లి సరఫరా మొదలైంది.
గత రెండునెలలుగా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లిపంట పాడైపోవడం వల్ల హైదరాబాద్కు ఉల్లిసరఫరా తగ్గింది. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టాల్లోనూ ఉల్లిపంట ఆశించనంతగా లేక పోవడం, ఉత్పత్తి అయిన ఉల్లిలో చాలా మటుకు వర్షాలకు తడిసిపాడైపోయింది. దీంతో ఉల్లిధరలు భారీగా పెరిగిపోయాయి. కేజీ ఉల్లిపాయ 200 రూపాయలకి కిలోకు చేరింది.
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆఫ్గానిస్తాను ఇతర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈజిప్ట్ నుంచి కూడా కొంత ఉల్లిని దిగుమతి చేసుకుని రైతు బజార్ల ద్వారా కిలో 50 రూపాయలకు అమ్మకాలు చేపట్టింది. అయితే ఇటీవల మహారాష్ట్రలో కొత్తపంట చేతికి రావడంతో దేశంలోని వివిధ రాష్ర్టాలకు ఉల్లిసరఫరాను ప్రారంభించారు.
అలాంటి ఈ ఉల్లి ధర మహారాష్ట్ర పుణ్యమా అని హోల్సేల్ మార్కెట్లో ఫస్ట్క్వాలిటీ ఉల్లిగడ్డ క్వింటాల్కు 13వేల నుంచి 14వేల రూపాయలు పలుకుతోంది. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లిగడ్డ 120 నుంచి 150 రూపాయలు పలుకుతోంది. ఇక సెకండ్ క్వాలిటీ ఉల్లిగడ్డ రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి గడ్డ కిలో ఉల్లిగడ్డ 70 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇలా ఉల్లి ధరలు తగ్గటం ప్రారంభించాయి. ఏది ఏమైనా ఈ ఉల్లి ధరలు భారీగా తగ్గటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.