ఏపీ అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా  మద్యపాన నిషేధంపై  చర్చ జరిగింది.  ఈ  చర్చ సభలో వాడి వేడి వాతావరణాన్ని కాస్త నవ్వుల వాతావరణానికి తీసుకోని వచ్చింది. టీడీపీ సభ్యులు మద్యపాన నిషేధంపైచర్చ జరుపుతుండగా..దీనిపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వైన్ షాపులతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని గురించి  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని..  కానీ ఇప్పుడు దశలవారీ అంటున్నారు.. ఇదీ మాట తప్పడం కాదా అంటూ మాట్లాడారు  భవాని.

 

మద్యం విషయంలో ప్రభుత్వం తీరు చూస్తుంటే.. మద్యం నియంత్రిస్తున్నట్లు ప్రజలకు భ్రమ కల్పిస్తూ .. షాపులు తగ్గించామని చెబుతున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే.కానీ  మద్యంపై ప్రభుత్వాలకు లాభాలు వస్తున్నాయని.. ఇటు రేట్లు  కూడా భారీగా పెంచారు వాటితో పాటు . షాపుల అద్దెలు భారీగా పెంచారని.. ఆ షాపులు కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలవే అంటూ విమర్శించారు. మద్యం షాపులు ఇళ్లు, ఆలయాలు, స్కూళ్ల మధ్యలో ఉన్నాయని.. చాలామంది మహిళలు బాధపడుతూ  తనకు ఫిర్యాదుచేసారని ఆమె చెప్పారు .

 

మద్యం షాపుల విషయాన్ని అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోకపోవడంతో మహిళలకు ఆందోళనకు గురి చేస్తుందన్నారు .. ఎక్సైజ్ సిబ్బంది కొరతతో తనిఖీలు తూతూమంత్రంగా జరుపుతున్నారు అన్నారు  భవాని. షాపుల్లో పనిచేసేవాళ్లు బయట మద్యం అమ్మకాలు చేస్తున్నారని.. బెల్ట్‌ షాపులకు మద్యం వెళుతోందన్నారు. యువతకు మంచి కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఇలా వైన్ షాపుల్లో ఉద్యోగాలు ఇవ్వడం సమంజసం కాదు అన్నారు.

 

గతంలో చాలా బ్రాండ్స్ ఉండేవి .. ఇప్పుడు చాలా తగ్గించారన్నారు ఆదిరెడ్డి భవాని. ఇలా మద్యం బ్రాండ్ల విషయాన్ని ప్రస్తావించగానే.. స్పీకర్ తమ్మనేని సీతారాం స్పందించారు. ‘నీకెందుకు తల్లీ ఆ బ్రాండ్స్ విషయం.. వాళ్లు మాట్లడతారు వదిలేయ్’అనడంతో సభలో సభ్యులంతా పెద్దగా నవ్వారు. దానితో  ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: