ఆంధ్రప్రదేశ్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడి వేడి చర్చలు మధ్య జరుగుతుంది. విపక్షాలు, అధికార పక్షాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సభను రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ విధానాలను తీసుకొని వచ్చిన ప్రభుత్వంపై టిడిపి వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

 దేవాలయంలో దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా? మోకాలికీ బోడి గుండికీ పెడతాడు చంద్రబాబు. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లున్నాయి? అందులో ఎన్ని ఎస్సీలకి ఇచ్చాడు? వారిలో ఎంత మంది గెలిచారు? కేవలం ఒక్కరంటే ఒక్కరే గెలిచారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేసాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఒకప్పుడు ఎస్సీల్లో ఎవరు పుడతారు అని ప్రశ్నించాడు. తన హాయంలో ఎస్సీలపై  అన్ని దాడులు జరిగితే ఆయన నోరు ఎక్కడికి పోయిందో అని అడిగారు ?

 


 ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మొత్తం మింగేసిన వాళ్లు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టాల గురించి నీతులు చెబుతుంటే చాలా బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు నిజంగా రాజకీయ నాయకుడైతే దళితుల్లో పుట్టాలనుకుంటారా అన్నందుకు చట్ట సభలో ఆయన  ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అని అన్నారు నాగార్జున. ఇలాంటి చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి గురించి, జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. దళితులకు వారిద్దరూ చేసిన సేవ, అలాగే వాళ్ళ మీద దళితులుకున్న విశ్వాసం ఎవ్వరికీ లేవు. 

 

చట్ట సభల్లో దళితులను అవమానించిన వ్యక్తివి నువ్వు అని చంద్రబాబుని అన్నారు నాగార్జున. దళిత చట్టాలను చుట్టాలుగా చేసుకున్న వ్యక్తివి. దళితుల మీద దాడులు చేసిన వ్యక్తివి. నీకు అసలు మాట్లాడే అర్హత లేదు. అసలు దళితులకు రావాల్సిన హక్కులు కాలరాసింది చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ పై అసెంబ్లీలో చర్చ పూర్తయ్యాక మొదటి కేసు చంద్రబాబు మీద పెట్టాలి అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: