ఇటీవల వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి హోం శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి నవంబరు 22న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అప్పటిలో నాలుగు వారాల పాటు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులను నిలిపి వేయాలని తెలియచేయడం జరిగింది. తాజాగా మరోసారి హైకోర్టు స్టే పొడిగించడం జరిగింది. ఎనిమిది వారాల పాటు చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో చెన్నమనేనికి ఒక మంచి శుభవార్తే అనే చెప్పాలి.
ఇక మరో వైపు చెన్నమనేని పౌరసత్వం కేసు విచారణ సందర్భంగా రమేష్కు జర్మనీ, భారతీయ పౌరసత్వం ఉందని పిటిషనర్ తెలియచేయడం కూడా జరిగింది. అయితే, ఇప్పటికే జర్మనీ పౌరసత్వం రద్దు చేశారు అని ఆయన తరఫున ఉన్న లాయర్ కోర్టుకు తెలియచేయడం జరిగింది. ఈ తరుణంలో రెండు పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టాలి అని పిటీషనర్ను హైకోర్టు కోరడం జరిగింది. ఇక తదుపరి విచారణను నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేయడం జరిగింది.
రమేశ్ తెలుపుతూ.. తన పౌరసత్వ విషయంలో కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ, చట్ట విరుద్ధగా ఉంది తన పిటిషన్లో తెలిపారు. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10(3)ని పరిగణనలోకి తీసుకోవాలని జూన్ 10న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ అసలు లెక్క చేయలేదు అని, ఏదో కంటి తుడుపు చర్యగా పరిశీలించి అనాలోచితంగా నిర్ణయం తెలిపారు అని అన్నారు.
ఇక గతంలో 2009లో రమేష్బాబు పౌరసత్వం చెల్లదంటూ ఆయనపై పోటీ చేసి విజయం అందుకోలేక పోయిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గతంలో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. నిజానికి దాచిపెట్టి మోస పూరితంగా చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం పొందాడని ఆది శ్రీనివాస్ అయినా పై ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఈ విషయంపై విచారణ చేసి కేంద్ర హోం శాఖ చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు కూడా చేయడం జరిగింది.