అసెంబ్లీ లో చంద్రబాబు గురించి వైస్ జగన్ మాట్లాడుతూ వందేళ్ల నాడే చంద్రబాబు లాంటి నైజం గురించి గురజాడ అప్పారావు ఒక మాటన్నారు. ఎంచిచూడక మనుష్యులందున మంచిచెడులు రెండే కులములు.. మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనౌతా అన్నారు. వందేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడాడు .
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు. ప్రపంచంలో ఇంతదారుణంగా మోసాలు చేసే వారు చంద్రబాబు తప్ప బహుశా ఇంకా ఎవరు ఉండరేమో అని అన్నారు .. సభలో చంద్రబాబు మాట్లాడినంత వరకు మా సభ్యులు నిశ్శబ్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వివరణ సమయంలో గోళ చేస్తున్నారు. సీఎం చెప్పే నిజాలు బయటి ప్రపంచానికి తెలియకూడదని ఆత్రుత పడుతున్నారు . 2003లో ఏపీ స్టేట్ కమిషన్ తెచ్చానని చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది.
ఎందుకంటఅంతకుముందే 1992లోనే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఎస్సీ ఏర్పాటైంది. ఈయన మాత్రం 1994-95 నుంచే సీఎం అయ్యుండి కూడా ఏనాడూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయలేదు. కానీ 2003లో ఎన్నికలొస్తుంటే హడావుడిగా అప్పటికి అప్పుడు ఎస్సీఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశాడు తప్ప.. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో కాదు . పైగా ఒక ముఖ్యమంత్రి అయ్యుండి `దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు`అని అనడం తెలుగు ప్రజలందరికీ తెలుసు.
రాజధానిలో సీఆర్డీఏ ప్యాకేజీల్లోనూ చిన్నచూపు చూశాడు. ఎక్కడ చూసినా దళితులు, బీసీలు, ఎస్టీలు మైనారిటీల విషయంలో తీవ్ర వివక్ష చూపించాడు. కానీ ఈయన మాత్రం దళిత జనోద్ధారకుడిలా మాట్లాడతాడు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తిత్వం నారా చంద్రబాబు నాయుడిది. అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టగలడు, పిల్లనిచ్చిన మామను వెన్నుపొటు పొడవగలడు.
ఎస్సీ, ఎస్టీల సమస్యలను సమూలంగా లేకుండా చేయాలని తలంపుతో రెండు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేశాం. కానీ ప్రతిపక్షం చూస్తే సభలో బిల్లుపై చర్చ జరుగుతుంటే అడ్డుకుంటారు. అడుగడుగునా గొడవ చేస్తారు. ఇదే వారికి ఎస్సీ, ఎస్టీల మీద ప్రేమ. ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే బిల్లును ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది.కేబినెట్లో 60%మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్న రాష్ట్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటిది. కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికలొచ్చేదాకా ఒక్క ఎస్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వని నేపథ్యం బాబుది.