ఎస్సీ, ఎస్టీలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఆయన తీరును మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీల నిధుల్ని దొంగ దీక్షలకు కూడా వాడారన్నారు. ఐదేళ్లలో ఏనాడైనా 'దిశ' లాంటి చట్టాల్ని తయారు చేశారా అని నిలదీశారు. దిశ చట్టాన్ని పంపమని ఢిల్లీ ప్రభుత్వం కోరిందని ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు. వాస్తవం చెప్పాలంటే  కడుపు మంటతో చంద్రబాబు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వక్రీకరణ ఆపేసి... సూటిగా మాట్లాడండి.. చంద్రబాబు గారు అంటూ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 
దిశ చట్టం రోజున లావణ్య అనే అమ్మాయిని లక్ష్మణరెడ్డి అనే అబ్బాయి చట్టం వచ్చిన రోజునే అత్యాచారం చేశారని.. చట్టం వల్ల రేప్‌ చేశారన్నట్లు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వక్రీకరించి చెబుతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఈ విషయం స్పీకర్‌ గారి దృష్టికి తెస్తున్నానని మంత్రి కన్నబాబు తెలిపారు. ఎస్సీల అభ్యున్నతి కోసమే పుట్టినట్లు  చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. 2009-2014లో శానసభ్యుడుగా ఉన్నప్పుడు ఏపీ శాసనసభ ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్‌ ఇవ్వాలని కీలకమైన చట్టం చేసిందని కన్నబాబు అన్నారు. ఆరోజు ప్రతిపక్షనాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారనే సాకుతో సభకు రాలేదని కన్నబాబు గుర్తు చేశారు. మరి, గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారిమళ్లించి స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లోనూ, చివరికి దొంగ దీక్షలకీ.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల్ని మళ్లించి వాడుకొన్నారని కన్నబాబు అన్నారు. 

దిశచట్టం వచ్చిన రోజున అత్యాచారం జరిగిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. దిశ చట్టాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారని కన్నబాబు తెలిపారు. గత ఐదేళ్లలో ఎప్పుడైనా అలాంటి చట్టం చేయలనే దమ్ము ఎప్పుడైనా వాళ్లకు ఉందా? మహిళల గురించి ఆలోచించారా అని కన్నబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన కేసుల గురించి ఇవాళ్టికీ పత్రికల్లో కథనాలు రాస్తున్నారు. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి మాట్లాడారా? ఐదేళ్లలో ఆయేషా కేసు గురించి చంద్రబాబు హయాంలో ఏమైనా చేశారా? అని కన్నబాబు నిలదీశారు. చంద్రబాబు ఏ రోజు చిత్తశుద్ధితో పనిచేయలేదని కన్నబాబు ఎద్దేవా చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని ఏ విధంగా తప్పుపట్టాలి? ఏ విధంగా దుయ్యబట్టాలి, బురదచల్లాలనే ఏకైక అజెండాతో చంద్రబాబు పనిచేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ బిల్లుపై చంద్రబాబు మాట్లాడటంపై గౌరవ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని, ఆయనకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారని కన్నబాబు తెలిపారు.

దయచేసి చంద్రబాబు వక్రీకరణ చేయటం మానుకోవాలన్నారు. దయచేసి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సూటిగా మాట్లాడాలని స్పీకర్‌ ద్వారా కోరుతున్నానని కన్నబాబు తెలిపారు. అయినా చంద్రబాబు వక్రీకరణ మార్చుకోవటం లేదు. 21 రోజుల్లో ఉరితీయాలని దిశ చట్టాన్ని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ దిశ చట్టాన్ని ఢిల్లీ ప్రభుత్వం పంపమందని స్పీకర్‌ గారే తెలిపారని కన్నబాబు అన్నారు. దేశం మొత్తం మనవైపు తిరిగి చూస్తోంది. ఇంత గొప్ప చట్టాన్ని తయారు చేసి నాయకుడ్ని మేం అనుసరిస్తామని అంటోంది. అది వదిలేసి చంద్రబాబు కడుపు మంటతో మాట్లాడుతున్నారని కన్నబాబు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల మీద చంద్రబాబు చాలా చెప్పారు. ఏకరంగా కులాల మధ్య విభజన చేస్తారో ఈదేశం, రాష్ర్టం చూసిందన్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు వక్రీకరణను ఉపసంహరించుకోవాలని కన్నబాబు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: