నూడుల్స్.. ఎంతోమందికి ఇష్టం. ఈ నూడుల్స్ కోసం ఎంతో మంది పడిచస్తారు. అయితే ఇప్పుడు ఆ నూడుల్స్ ప్రియులు అందరికి సోషల్ మీడియాలో నరకం చూపిస్తుంది ఓ ఫొటో. ఏంటో ఆ ఫోటో అనుకుంటున్నారా ? ఆల్రెడీ ఫోటో చూశారు కదా. అదే ఆరెంజ్ నూడుల్స్. ఈ నూడుల్స్ చూస్తూనే నూడుల్స్ ప్రియులు అందరూ కన్నీరు పెట్టేసుకుంటున్నారు. 

 

ఎందుకయ్యా.. ఇలా వంటలు చేసి మమ్మల్ని చంపుతున్నారు అంటూ కామెంట్లు పెట్టి కన్నీరుమున్నీరవుతున్నారు. ఏదైనా వంటకం బాగాలేదు అని ఎవరైనా చెప్తేనే మనము తినము. అయితే కొన్ని రెసిపీల ప్లేరు చెబితేనే కడుపులో దేవేస్తుంది. ఇక వాటి ఫోటోలు చూస్తే వాంతులు ఖాయం. ప్రస్తుతం అదే అవుతుంది ఈ ఆరంజ్ నూడుల్స్ రెసిపీ చూస్తుంటే.  

 

నూడుల్స్ అంటే కాస్త స్పైసీగా ఉండాలి అని కోరుకుంటాము. అలాంటి నూడుల్స్ ఏ తింటాము కూడా.. కానీ ఎవరో నారింజ పళ్లు వేసి నూడుల్స్ వండేశారు. దాన్ని కాస్త సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఈ దారుణం చూడలేక కొంతమంది సోషల్ మీడియాలో 'శాడిజానికి కూడా హద్దూపద్దూ ఉండాలి' అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆహార ప్రియులు అంత సోషల్ మీడియాలో ఇది చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: