వైసీపీ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి యనమల రామకృష్ణుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ప్రతిసారి ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా యనమల రామకృష్ణుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''యనమల గారు కూడా నీతి బోధలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఈయన ప్రధాన భాగస్వామి. అప్పటి పల్లకీ సేవకు తన బంధువులకు అనేక పదవులు, వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకున్నాడు. కులజ్యోతి రాసిన కడుపు మంట వార్తను పట్టుకుని పత్తిగింజ కబుర్లు చెబుతున్నాడు.'' అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు.  

 

యనమల రామకృష్ణుడుకి అప్పట్లో వెన్నుపోటు పొడిచిన కుట్రలో అతనికి ప్రధాన భాగస్వామ్యం ఉందని.. తన బంధువులకు ఎన్నో పదవులు ఇచ్చారని.. ఇప్పుడు కులజ్యోతి రాసిన కడుపు మంట వార్తను తీసుకొచ్చి పత్తిగింజ కబుర్లు చెబుతున్నారని ఘోరాతి ఘోరంగా ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. ఈ వ్యాఖ్యలు చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా ఈ ట్విట్ కారణంగా వైసీపీ అభిమానులు.. టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: