ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ప్రస్తావిస్తూ ఎల్లోమీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.   

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధిక ట్విట్ చేస్తూ ''చంద్రబాబు, దత్త పుత్రుడిని భుజాలపై మోస్తున్న ఎల్లో మీడియాకు రాజా రవితేజ గారు చెబ్తున్న 'సెటిల్మెంట్ల' రహస్యాలు వినిపించడం లేదు. తమ కోడి కూస్తేనే తెల్లారుతుందని భ్రమ పడుతోందింకా. అరచేతులు అడ్డు పెట్టి ఎంత దాచినా సోషల్ మీడియా ఊరుకోదుగా? చీల్చి చెండాడుతోంది.'' అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. 

 

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని భుజాలపై మోసే ఎల్లో మీడియాకు రాజా రవితేజ గారు చెప్పే 'సెటిల్మెంట్ రహస్యాలు' వినిపించటం లేదు. వారి కోడి కూస్తేనే తెల్లవారుతుంది అన్నట్టు భ్రమ పడుతోంది ఇంకా అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. దీంతో ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా వైసీపీ, టీడీపీ పార్టీల అభిమానుల మధ్య ఈ ట్విట్ తో ట్విట్టర్ లో చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: