సమాజాన్ని ఉగ్రవాదులకంటే భయంకరంగా పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఆడవాళ్ల మీద హత్యాచారాలు, శరీరాలతో వ్యభిచారాలు. ఇవి రెండు ఎంతలా మనుషుల మనసుల పై ప్రభావాన్ని చూపుతున్నాయంటే గాలికంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. ఎంతలా కట్టడి చేసిన, ఎన్ని చట్టాలతో భయపెట్టాలని చూసిన మనుషుల్లో మానవత్వంతో పాటుగా భయం కూడా చచ్చిపోయింది.

 

 

ఇకపోతే ఓ హైటెక్‌ వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో పక్కా ప్లాన్‌ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. పూర్తి వివరాలు పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో మురకంబట్టు నగరంలోని ఆదివారం నిర్వహించిన దాడుల్లో నలుగురు యువతులను, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

మురకంబట్టు కేంద్రంగా చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు అందమైన యువతుల ఫొటోలను  నిర్వాహకురాలు వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేసి, వీళ్ల రేట్లను సైతం అందులో ఉంచుతూ వచ్చింది. ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు ధరలు నిర్ణయించేది.

 

 

ఇదే కాకుండా యువతులను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు సమాచారం. ఇకపోతే  కాలేజీకి వెళ్లే అమ్మాయిల్లా ఉన్న వీరిని చూసిన స్దానికులకు కూడా అనుమానం కలుగలేదట. అయితే గత కొన్ని రోజుల నుండి  ఓ వ్యక్తి వీరి వాలకాన్ని పసిగట్టి నేరుగా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారి స్టైల్లో . విటులుగా మారి మఫ్టీలో ఆడ పోలీసులతో నిఘా ఉంచి చాకచక్యంగా వ్యభిచార వ్యవహారాన్ని పట్టుకున్నారు.

 

 

ఈ మొత్తం ఘటనలో మురకంబట్టుకు చెందిన ఓ మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో ఎంతటి వాళ్లున్నా వదిలే ప్రసక్తేలేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వాహకురాలిని సైతం అదుపులోకి తీసుకున్నారు. యువతులను మాత్రం వారి సొంత ఊర్లకు పంపడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.  ఇకపోతే రాష్ట్రం లో జరుగుతున్న ఇలాంటి అసాంఘిక చర్యల వల్ల యువత తప్పుడు మార్గంలో పయణించే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులే ప్రత్యేక చొరవ తీసుకుని వారి పిల్లలను అదుపులో ఉంచుకుంటే మంచిదని కొందరు నిపుణులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: