సమాజంలో మనుషులకు ఉన్న స్వేచ్చ వేరే ఏ ప్రాణికి కూడా లేదేమో. తనలోని భావాలను ఏవిధంగా అయినా వెలిబుచ్చవచ్చూ. కాని కొందరు ఈ భావ ప్రకటనా స్వేచ్ఛను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటూ సమాజానికి కొన్ని తలనొప్పులను తెస్తున్నారు.. ఇకపోతే ప్రతి వ్యక్తి  తన  భావాలను పంచుకోవడానికి సరైన వేదిక సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చూ..

 

 

మనం చేసే పనిని నలుగురికి తెలియ చెప్పాలంటే సంకోచం లేకుండా నలుగురికి తెలియ జేయవచ్చూ. ఆ పని ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సోషల్ మీడియా ద్వారా ఈజీగా చేయవచ్చూ అని ఇప్పటికే కొందరు నిరూపించారు కూడా. కాకపోతే, ఎవరైన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే చిక్కులు వచ్చి పడతాయి. కానీ, వివాదాస్పద నటి శ్రీరెడ్డికి ఆ భయంలేదు. నన్నెవరూ ఏమీ చేయలేరు అనే ధైర్యం ఆమెది. అందుకే, చెన్నైలో ఉంటూ ఏపీ, తెలంగాణలో ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులపై సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడుతూ ఉంటుందామె..

 

 

ఇకపోతే ఇప్పటికే పలువిధాలుగా వివాదస్పద విషయాల్లో చిక్కుకున్న ఆమె మరోసారి తన బూతు పురాణాన్ని ప్రజలకు వినబెడుతుంది. అదేమంటే తాజాగా ఆమె తన ఫేస్‌బుక్ పేజ్‌లో లైవ్ వీడియో చేసింది. సుమారు 20 నిమిషాల పాటు చేసిన ఈ లైవ్‌లో మరోసారి ఎప్పటిలానే తనకు సంబంధంలేని రాజకీయాల్లో తలదూర్చి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతూ.. ఆయన్ని విమర్శిస్తున్న వారిని తిడుతూ వేడి పుట్టించింది. శ్రీరెడ్డి ఈ లైవ్ వీడియోలో చాలా పచ్చిగా బూతులు కూడా మాట్లాడేసింది.

 

 

జగన్ పాలన అద్భుతంగా ఉందని, ఆయన గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించింది. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నేత జగన్ అని ఒక మంచి మనిషి, మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారని వెల్లడించింది. అంతకు ముందుతో పోలిస్తే జగన్‌లో చాలా పరిక్వత వచ్చిందని పేర్కొంది.

 

 

ఎంతో గొప్పగా పాలన కొనసాగిస్తోన్న జగన్‌కు చాలా మంది అడ్డంగా వస్తున్నారని.. వాళ్లకు అసలు సిగ్గులేదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఈ వీడియోలో శ్రీరెడ్డి ప్రధానంగా టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్టు తిట్టేసింది. అలాంటి పదాలను రాయలేం కూడా. అందుకే, మీరే ఆమె ఫేస్‌బుక్ పేజ్‌లో చూడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: