ఈ సమాజంలో కామాంధులు ఏ రూపంలో ఉంటున్నరో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి అమ్మాయిలు ఎవరినీ నమ్మే రోజులు కావు ఇవి. చెల్లి అని పిలుస్తూనే.. ఓ బాలికను పలు సార్లు అత్యాచారం చేసిన దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది.

 

 

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా..సంతబొమ్మాళి మండలం నౌపడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో..

 

ఉప్పాడ సంతోష్‌  అనే యువకుడు బాలిక తల్లిని పిన్ని అని పిలుస్తూ తరచూ ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఆ చనువు తోనే ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెపై అఘాయిత్యం చేసేటప్పుడు సెల్‌ఫోను తో ఫోటోలు, వీడియోలు తీస్తూ రాక్షసానందం పొందేవాడు.

 

 

 రెండు నెలలుగా అఘాయిత్యం చేస్తూ వచ్చిన అతడు బాలికను పదేపదే కోరిక తీర్చమని బలవంతం పెట్టేవాడు. లేకుంటే ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేస్తానని, చంపేస్తానని హెచ్చరించేవాడు. గత వారం రోజులుగా కోరిక తీర్చాలంటూ వెంటపడటంతో బాలిక నిరాకరించింది. దీంతో విదేశాల్లో ఉన్న బాలిక తండ్రికి.. బాలికతో అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలు, ఫొటోలు వాట్సాప్‌ ద్వారా పంపాడు.

 

 

 బాలిక తండ్రి భార్యకు ఫోనులో సమాచారం అందించడంతో జరిగిన ఘోరం బయటపడింది. బాలికను తల్లి గట్టిగా నిలదీయడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. బాధితురాలి తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి పై ఫోక్స్‌ చట్టం కింద 376 (3), 506, ఐటీ యాక్ట్‌ చట్టం కింద 67(బి),ఎ, బీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 

అందుకే ఎదిగే పిల్లలను కంటికి రెప్పలా కాపాడు కోవాలి.. ప్రత్యేకించి అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్న, తమ్ముడు, బాబాయి, ఎవరినీ నమ్మే రోజులు కావివి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: