దిశ చట్టం అమల్లోకి రాకముందే లోపాలున్నాయని ఆరోపించడం తగదు. టీడీపీ సభ్యులు ఉద్దేశ పూర్వకంగా బురదజల్లాలని చూస్తున్నారు. కొత్త సభ్యుడులా మూడుసార్లు సీఎం అయిన వ్యక్తి మాట్లాడటం ఏంటని ఏపీ రాష్ట్ర  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. మరో పక్క  ప్రతిపక్షాలకు గాబరా ఎందుకు అన్న స్పీకర్‌. ప్రతిపక్షాల సూచనలను హోంమంత్రి పరిగణలోకి తీసుకోవాలన్న స్పీకర్‌ సూచించారు. ఇలా మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి.  

దిశ చట్టంలో లోపం ఉంది సరిచేయమని కోరుతుంటే అధికారపక్షం ఎదురుదాడి చేస్తున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘాటుగా స్పందించారు. దిశ బిల్లు చేసి చట్టం ఇంకా అమల్లోకి రాలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌ గుర్తు చేశారు. దిశ చట్టంలోనే లోపం ఉంది. కాబట్టి ఏదో జరుగుతోందని అనటం ఏంటని బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. సభా వ్యవహారాలు ఏదో తెలియని వాళ్లు, మొదటిసారి సభకు వచ్చిన వారు మాట్లాడుతున్నారంటే అర్థం ఉంటుందని బుగ్గన ఎద్దేవా చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకుడు కూడా అదే చెప్పటంపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలని తప్ప వేరే ఏమైనా అర్థం ఉందా అని బుగ్గన నిలదీశారు. ఇంకా దిశ చట్టమే అమల్లోకే రాలేదు. ఇవాళ చట్టం తయారు చేశాక మరుసటి రోజు పొద్దున్నే అమల్లోకి వస్తుందా అని బుగ్గన నిలదీశారు. 

ఈ అంశంలో స్పీకర్‌ తమ్మినేని సీతారం జోక్యం చేసుకుంటూ గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు మంచి చట్టాలు ప్రజల కోసం తయారు చేస్తుందని అన్నారు.  జరుగుతున్న సంఘటనలు అన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్‌ నిలదీశారు. దిశ చట్టం నిన్నగాక మొన్న చట్టం అయింది. ఎందుకు గాబరా పడుతున్నారని ప్రతిపక్షాలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే చట్టాలు తయారు చేస్తాయి. అవి ప్రజలకు రీచ్ కావాలన్నారు.  ప్రతిపక్షాల సూచిస్తున్న సూచనలను హోంమంత్రి గారు నోట్‌ చేసుకొని వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పీకర్‌  తమ్మినేని సీతారాం సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: