దిశ నిందితుల  ఎన్ కౌంటర్ తరువాత మహిళలపై అత్యాచార ఘటనలు తగ్గిపోతాయని అందరూ భావించారు . కానీ రాష్ట్రం లో పలు చోట్ల మహిళలు , చిన్నారులపై  లైంగిక దాడులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది . ఓ నిండు గర్భిణీ పై ఒక కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .  తొమ్మిది నెలల గర్భిణీ పై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ సర్వత్రా విన్పిస్తోంది .

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన మహిళా కొన్నేళ్లుగా కరీంనగర్ మండల పరిధిలోని బొమ్మకల్ లో కుటుంబం తో నివసిస్తోంది . ఆమె భర్త సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహిస్తూ , కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు . భర్త లేని సమయం లో ఇంట్లో ఒంటరిగా ఉన్న సదరు మహిళపై  ఈ నెల 9 వ తేదీన మధ్యాహ్నం, కనెక్షన్ పేరు చెప్పి ఇంట్లో ప్రవేశించిన ఆగంతకుడు  కనకాపర్తి రామకృష్ణ అత్యాచారానికి తెగబడి  ఆపై వీడియో చిత్రీకరణ చేశాడు .  ఆ సమయం లో మహిళ మెడ లో ఉన్న పుస్తెలతాడు తెగిపోయింది .

 

కొద్దిసేపటి తరువాత భర్త ఇంటికి రాగా, సదరు మహిళ తెగిపోయిన  పుస్తెలతాడు కుట్టుకుంటూ ఉండడం , ఇంట్లో బట్టలు చిందరవందరగా పడి ఉండడంతో అనుమానం వచ్చిన భర్త ఏమి జరిగిందని భార్య ను ప్రశ్నించగా , జరిగిన అఘాయిత్యం గురించి  తన భర్తకు ఆమె  వివరించింది .  అయితే ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన భార్య , భర్తలు పోలీసులకు  ఫిర్యాదు చేయకుండా, మిన్నకుండి పోయారు . అయితే సోమవారం ధైర్యం చేసి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కరీంనగర్ పోలీసులు  నిందితుడిపై అత్యాచార కేసు తో ఎస్సి , ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు .   

మరింత సమాచారం తెలుసుకోండి: