ఈ కాలం పిల్లలు అందరిని కామెంట్ చేస్తారు. ఇంట్లో అక్కని, చెల్లిని, తల్లిని ఆఖరికి అమ్మపై కూడా ఏవోక సెటైర్లు వేసి వెళ్తారు. అది ఈ కాలం పిల్లల అలవాటు. ఆ అలవాటు రావడానికి ఒక రకంగా పెద్దలు, టీచర్లు ఏ కారణం అని చెప్పచ్చు. పెద్దలు ఏమో ఇంట్లో జబర్దస్తు, పటాస్ అంటూ ప్రోగ్రాములు చూస్తూ పిల్లలకు అలవాటు చేస్తారు. ఆ అలవాట్లే ఎవర్ని పడితే వారిని చిన్న పెద్ద లేకుండా కామెంట్లు చేస్తారు. 

 

ఆలా కామెంట్లు చేసే ఓ పడవ తరగతి విద్యార్థి టీచర్ తో కొట్టించుకొని ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇంకా అసలు విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో టీచర్లకు కాస్త కూడా ఓపిక లేకుండా పోతుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరంలోని ఇక్రా హైస్కూల్లో విద్యార్థి క్లాస్ రూమ్‌లో నవ్వాడని, టీచర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు. దీంతో ఆ విద్యార్థి విపు మొత్తం వాచిపోయింది. 

 

అచ్చం అలానే ఈరోజు కూడా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దారుణ ఘటన ఏంటంటే... టీచర్‌ను కామెంట్ చేశాడన్న నెపంతో ప్రిన్సిపాల్ సహా ఉపాధ్యాయులు ఓ విద్యార్థికి చిత్రహింసలు పెట్టారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల మోడల్‌ స్కూల్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. టీచర్‌ను కామెంట్‌ చేశాడనే నెపంతో.. పదో తరగతి విద్యార్థి శివను ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు హింసించారు.      

 

అయితే ఈ ఘటన బయటకు రాకూడదు అనే ఉద్దేశ్యంతో స్కూల్‌లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆ చిత్ర హింసలకు గురైన విద్యార్థి శివ ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాడు. దీంతో ఈ ఘటన బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: