చంద్రబాబు 2004 వ సంవత్సరం నుండి  2013 వరకు వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. కాని ఈ చరిత్ర వెనక ఒక మచ్చ కూడా ఉంది అదేమంటే తన రాజకీయ కెరీర్ లో ఓటమి పాలైన ప్రతిసారి వైఎస్ ఫ్యామిలీ చేతిలోనే కావటం విశేషం. ఈ విషయాన్ని చూస్తుంటే చంద్రబాబునాయుడి ఓటమికి..వైఎస్ ఫ్యామిలీకి  ఏదైన లింక్ ఉందేమో అనిపిస్తుంది.

 

 

ఎందుకంటే బాబు ఓటమి పాలైన ప్రతిసారి వైఎస్ ఫ్యామిలీ చేతిలోనే కావటం. ఇక బాబు వైఎస్ ఫ్యామిలీ చేతిలో ఒప్పటి వరకు మూడు సార్లు ఓటమిని చవిచూసారు. 2004లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాల్లో వైఎస్ చేసిన పాదయాత్ర కూడా ఒకటి. అప్పటికే చంద్రబాబుపై  వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం..దీనికి తోడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మండుటెండల్లో వైఎస్ చేసిన పాదయాత్ర కూడా కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చింది. ఇది ఒకటి అయితే..

 

 

2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై  ఓ వైపు తెలుగుదేశం పార్టీ.. మరో వైపు మీడియా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేసినా కూడా రాజశేఖర్ రెడ్డి రెండవ సారి విజయం సాధించారు. తొలి దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ చేసిన సంక్షేమ కార్యక్రమాల ముందు అవినీతి ఆరోపణలు తేలిపోయాయి. ఇక రాజశేఖర్ రెడ్డి ఆ సమయంలో ఎన్ని విమర్శలు..ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా రెండవ సారి విజయం సాధించారు. ఇక తాజాగా మూడవసారి చంద్రబాబు అత్యంత పిన్న వయస్కుడైన జగన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అది కూడా ఊహించని స్థాయిలో ఈ ఓటమి ఉండటం విశేషం.

 

 

ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన వారందరూ ఊహించిందే. కాకపోతే ఇంత దారుణమైన ఓటమి ఉంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. వైసీపీకి వస్తే గరిష్టంగా 130 వరకూ రావొచ్చని అంచనా వేశారు. కానీ  ఈ సంఖ్య ఇఫ్పుడు 150కి  దగ్గర  ఉండటం విశేషం. ఇలా చంద్రబాబు తన మూడుసార్లు ఓటమి వైఎస్ ఫ్యామిలీ చేతిలోనే కావటం విశేషం.

 

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబు ఓటమికి కారణం అయ్యారు. వైఎస్ మరణానంతరం జగన్ సొంత పార్టీ పెట్టుకుని మూడవ సారి చంద్రబాబును  ఓటమి పాలు చేశారు. ఇకపోతే ఇలా  తండ్రి కొడుకుల చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన రికార్డు బాబోరికే సొంతం అయ్యింది అంటున్నారు తెలుగు ప్రజలు..

మరింత సమాచారం తెలుసుకోండి: