రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాజకీయమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం తగదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులపై మంగళవారం సభలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. నాన్‌ డెల్టా ప్రాంతం నుంచి ప్రతినిధులుగా రావడమే మా దురదృష్టం అని బాధపడ్డారు. మొన్న పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డిని ప్రశ్న అడిగినప్పుడు టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.

 

మా ప్రాంతంలో పంటలకు నీళ్లు లేవు, పరిశ్రమలు లేవు అక్కడ అసలు అభివృధే లేదు. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు మేం ప్రయత్నిస్తుంటే..మెట్ట ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని  మేం అడుగుతుంటే ఇక్కడ ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతున్నారు. 2013లో సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ప్రాజెక్టు మంజూరైంది. 

 

 అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మేమంతా కలిసి మాకు సాగునీరు, తాగునీరు లేదని వైయస్‌ఆర్‌ను అడిగాం. మాకు వర్షాధారం లేదు, సాగునీరు లేదని చెప్పాం.  మా దురదృష్టం మహానేత అకాల మరణం చెందడం. ఆ తరువాత 2013లో ఈ ప్రాజెక్టు మంజూరు చేశారు. సోమశిల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా 5 టీఎంసీలు తీసుకురావాలని, 5 వేల క్యూసెక్కులు వచ్చే విధంగా కాల్వలు, పైప్‌లైన్లు డిజైన్‌ చేయాలని కోరాం.

 

ఆత్మకూరు నియోజకవర్గంలో కొన్ని, ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాలు కలిపి డిజైన్‌ చేశాం. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపు 97 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాదాపుగా రెండున్నర లక్షల మంది ప్రజల దాహర్తి తీరుతుంది. మెట్ట ప్రాంతం కాబట్టి వర్షాలు కూడా కురవవు. ఇటువంటి ఎత్తిపోతల పథకాల ద్వారానే రైతులు పంటలు పండించుకోవాలి. తాగునీటికి కూడా ఇవే ప్రధానం. ఐదు రిజర్వాయర్లు రావాల్సి ఉంటే మొదటి ఫేజ్‌లోనే వీటిని నిర్మించాల్సి ఉంది. గతంలో కేవలం రాజకీయాల కోసం ఫేజ్‌ -2కు టెండర్లు పిలిచారు. ఎన్నిలకు కోసం జనవరిలో టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టుల ప్రయోజనం ప్రజలకు చేరదు. వైయస్‌ఆర్‌ సంకల్పించిన ప్రాజెక్టులను త్వరితగతిన భూసేకరణలు పూర్తి చేసి, నాణ్యమైన పనులు చేయించాలి అని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: