ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ.. ''నీ ప్రచార పిచ్చికి అంబేద్కర్ మహాశయుడి పేరు కూడా వాడుకుంటున్నావు కదా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఆయనకు భారతరత్న ఇప్పించిందా? బాబాసాహెబ్ కు అర్హత లేకున్నా మీరే ఇప్పించారన్నట్టు అవమానిస్తున్నారు కదా బాబూ? ఆలస్యంగానైనా ఆయనను భారతరత్నతో గౌరవించిందీ దేశం. మధ్యలో మీరెవరు?'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్వీట్లకు స్పందించిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ''దేశంలో ఏదిజరిగినా తనే కారణం అని చెప్పకునే అలవాటు బాబుకు వెన్నతో పెట్టిన విద్య. పెద్ద నోట్లరద్దు నా సలహనే అన్నడు, ప్రజలు తిరగబడితే అప్పుడు మోడీని తప్పన్నడు. యూటర్న్, వెన్నుపోటుకు, ఇలాంటి అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబుగారు. ఆయనే హక్కు దారు కాబట్టి ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదంతే.'' అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు నెటిజన్లు. కాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: