ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపుత్రుడు నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడు సుపుత్రుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. 

                

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా ట్విట్ చేస్తూ.. ''చరిత్ర సృష్టించేందుకే మంగళగిరిలో పోటీ చేశాడట చిట్టి నాయుడు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకనే కదా దొడ్డి దారిన ఎమ్మెల్సీ, మంత్రి అయింది. ఈ చరిత్ర సృష్టించాలన్న తాపత్రం ఏమిటో? రెండొందల కోట్లు వెదజల్లినా మంగళగిరిలో చిత్తుగా పరాజయం పాలయ్యావు. ఇకనైనా బడాయి మాటలు మానుకో చిట్టీ.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

          

ఈ ట్వీట్లకు స్పందించిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ''చిట్టినాయుడుకు అంత స్టామినా లేదు లెండి రెడ్డి గారు వదిలేయండి'' అంటూ చిట్టి నాయుడుపై సెటైర్లు వేశారు నెటిజన్లు. కాగా ఈ ట్విట్ కారణంగా వైసీపీ..టీడీపీ మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. అయితే ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: